News January 18, 2025
రాయలసీమను రతనాల సీమగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP, కేంద్రంలో NDA ప్రభుత్వం ఉండటం వల్లే అమరావతి, పోలవరం పనులు ముందుకెళ్తున్నాయని CM చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లూ ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందన్నారు. ఇప్పుడిప్పుడే కష్టాలన్నీ తీరిపోతున్నాయని చెప్పారు. మైదుకూరులో మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమగా చేయడమే తన లక్ష్యమన్నారు. గోదావరి-పెన్నా, పోలవరం-బనకచర్ల అనుసంధానమైతే గేమ్ఛేంజర్ అవుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
179 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంపాల్లో 179 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, పీజీ, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్లో అనుభవం ఉండాలి. ప్రొఫెసర్కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్కు రూ.57,700 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://cau.ac.in/
News December 4, 2025
దీపం కొండెక్కింది అని ఎందుకు అంటారు?

దీపం ఆరిపోవడాన్ని మనం ‘దీపం కొండెక్కింది’ అని అంటాం. దీని వెనుక ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది. సాధారణంగా మనం పర్వతాలను దైవ నివాసాలుగా భావిస్తాం. కొండలు దేవతలకు ఆశ్రయం ఇస్తాయని నమ్ముతాం. అయితే, దీపం జ్యోతి ఆరిపోయినప్పుడు, అది భౌతిక దేహాన్ని విడిచి, నేరుగా దైవంలో కలిసిపోయింది అని భావించాలి. దీపం దైవంలో ఐక్యమైందని చెప్పడానికే మనం ఆధ్యాత్మిక వ్యక్తీకరణను ఉపయోగిస్తూ ఇలా చెబుతుంటాం.
News December 4, 2025
SIM Bindingపై ఓటీటీలు, యాప్స్ అసంతృప్తి

OTTలు, వాట్సాప్ వంటి యాప్స్ పని చేయాలంటే ఫోన్లో యాక్టివ్ SIM ఉండాలన్న <<18424391>>DoT ఆదేశాలపై<<>> బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరమ్(BIF) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అమలును నిలిపేయాలని, యూజర్లపై ప్రభావాన్ని అంచనా వేయకుండా ఉత్తర్వులివ్వడం సరికాదని పేర్కొంది. టెలికాం కంపెనీలు మాత్రం DoTని అభినందించాయి. SIM Bindingతో యూజర్, నంబర్, డివైజ్ మధ్య నమ్మకమైన లింక్ ఉంటుందని, స్పామ్, ఆర్థిక మోసాలను తగ్గించవచ్చని అన్నాయి.


