News January 18, 2025

రాయలసీమను రతనాల సీమగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

image

AP, కేంద్రంలో NDA ప్రభుత్వం ఉండటం వల్లే అమరావతి, పోలవరం పనులు ముందుకెళ్తున్నాయని CM చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లూ ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందన్నారు. ఇప్పుడిప్పుడే కష్టాలన్నీ తీరిపోతున్నాయని చెప్పారు. మైదుకూరులో మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమగా చేయడమే తన లక్ష్యమన్నారు. గోదావరి-పెన్నా, పోలవరం-బనకచర్ల అనుసంధానమైతే గేమ్‌ఛేంజర్‌ అవుతుందని పేర్కొన్నారు.

Similar News

News November 27, 2025

రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్‌పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

News November 27, 2025

రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (<>TSLPRB<<>>) 60 పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, బీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబోరేటరీ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://www.tgprb.in

News November 27, 2025

చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

image

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.