News January 24, 2025
వైసీపీ చేసిన మంచిని ప్రజలకు బలంగా చెప్పాలి: సజ్జల

AP: వైసీపీ చేసిన మంచిని ప్రజలకు ఇంకా బలంగా చెప్పాలని ఆపార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ నేతలతో నిర్వహించిన వర్క్ షాప్లో ఆయన మాట్లాడారు. మీడియా అండతోనే అధికారంలోకి వస్తామనేది కేవలం అపోహ అని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మిసైల్స్లా దూసుకెళ్లాలన్నారు. టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని చెప్పారు.
Similar News
News December 23, 2025
బాంబులతో చెక్ డ్యామ్లను పేల్చేస్తున్నారు.. ఇదే సాక్ష్యం: కేటీఆర్

TG: ఇసుక మాఫియా కోసం బాంబులతో చెక్ డ్యామ్లను పేల్చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారు “ఇది మానవ నిర్మిత విధ్వంసం” అని మొత్తుకుంటున్నా, ఈ “చిట్టి నాయుడి” ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. డ్రిల్లింగ్ మెషీన్లతో హోల్స్ చేసి, జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారు’ అని Xలో ఫైరయ్యారు.
News December 23, 2025
ఆ ‘అధికారం’ ప్రజలదే.. మీరేమంటారు?

AP: అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఇది ఎన్నోసార్లు రుజువైంది. 30ఏళ్లు అధికారంలో ఉంటామని CMగా జగన్ పలుమార్లు చెప్పారు. కానీ 2024లో జనం ఓడించారు. 15ఏళ్లు పవర్ తమదేనని పవన్ కళ్యాణ్, లోకేశ్ ఇటీవల అంటున్నారు. YCPని శాశ్వతంగా అధికారానికి <<18642155>>దూరం<<>> చేస్తానని తాజాగా పవన్ అన్నారు. కానీ అధికారంలో ఎవరుండాలో నిర్ణయించే ‘అధికారం’ ప్రజలదే. ఎవరి గెలుపోటములైనా ఓటర్ల చేతుల్లోనే ఉంటాయి. మరి మీరేమంటారు?
News December 23, 2025
REWIND 2025: ప్రపంచంలో ముఖ్య ఘటనలు

*డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం
* కాథలిక్ చర్చి 267వ పోప్గా పోప్ లియో XIV ఎన్నిక
* Gen-Z నిరసనలతో నేపాల్ ప్రభుత్వ మార్పు
* హాంకాంగ్ వాంగ్ ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో 161 మంది మృతి
* జమైకాను వణికించిన మెలిస్సా తుఫాను.. మృతులు 102, 9లక్షల మంది బాధితులు
* మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 గెలిచిన భారత్
* US జోక్యంతో ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ


