News January 24, 2025

వైసీపీ చేసిన మంచిని ప్రజలకు బలంగా చెప్పాలి: సజ్జల

image

AP: వైసీపీ చేసిన మంచిని ప్రజలకు ఇంకా బలంగా చెప్పాలని ఆపార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ నేతలతో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. మీడియా అండతోనే అధికారంలోకి వస్తామనేది కేవలం అపోహ అని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మిసైల్స్‌లా దూసుకెళ్లాలన్నారు. టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని చెప్పారు.

Similar News

News December 12, 2025

‘అల్లూరి’ ప్రమాదంలో చనిపోయింది వీరే

image

AP: అల్లూరి జిల్లాలో జరిగిన <<18540010>>ప్రమాదంలో<<>> 9 మంది చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వారి వివరాలు.. శైలా రాణి(తెనాలి), శ్యామల(తిరుపతి), పి.సునంద(పలమనేరు), శివశంకర్ రెడ్డి(పలమనేరు), నాగేశ్వరరావు(చిత్తూరు), కావేరి కృష్ణ(బెంగళూరు), శ్రీకళ(చిత్తూరు), దొరబాబు(చిత్తూరు), కృష్ణకుమారి(బెంగళూరు). కాగా గాయపడిన 25 మందికి చింతూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

News December 12, 2025

రాజీనామా చేయాలనుకుంటున్నా.. బంగ్లా ప్రెసిడెంట్ సంచలన కామెంట్స్

image

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ దేశ అధ్యక్షుడిగా తనకున్న అధికారాలను తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపిస్తున్న యూనస్ తొలగించారని షాబుద్దీన్ అన్నారు. సుమారు 7 నెలలుగా తనతో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదని చెప్పారు. అన్ని దేశాలలోని బంగ్లా రాయబార కార్యాలయాల్లో తన ఫొటోను తొలగించారన్నారు. అవమానంగా ఉందని, ఎన్నికల తర్వాత తన పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.

News December 12, 2025

నకిలీ కాఫ్ సిరప్ తయారీ.. ED సోదాలు

image

అక్రమ కాఫ్ సిరప్ తయారీ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసు నమోదు కావడంతో ED సోదాలు చేస్తోంది. నిందితుడు శుభమ్ జైస్వాల్, అనుచరులు అలోక్ సింగ్, అమిత్ సింగ్ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తోంది. యూపీ, ఝార్ఖండ్, గుజరాత్‌లోని 25 ప్రాంతాల్లో ఉదయం 7:30 గంటల నుంచి ఏకకాలంలో దాడులు చేస్తోంది. యూఏఈలో తలదాచుకుంటున్న జైస్వాల్‌ను భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.