News January 24, 2025

వైసీపీ చేసిన మంచిని ప్రజలకు బలంగా చెప్పాలి: సజ్జల

image

AP: వైసీపీ చేసిన మంచిని ప్రజలకు ఇంకా బలంగా చెప్పాలని ఆపార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ నేతలతో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. మీడియా అండతోనే అధికారంలోకి వస్తామనేది కేవలం అపోహ అని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మిసైల్స్‌లా దూసుకెళ్లాలన్నారు. టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని చెప్పారు.

Similar News

News December 27, 2025

CBN ప్రభుత్వమని గుర్తుంచుకోండి: అనిత

image

AP: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని హోం మంత్రి అనిత హెచ్చరించారు. జంతుబలులు చేసి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తామంటే కుదరదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నది CBN ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ నేతలు చేసేది తప్పని చెప్పలేరా అని మండిపడ్డారు. ఆస్తి కోసం తల్లి, చెల్లెలిపై కేసులు పెట్టించిన వ్యక్తి మీ పిల్లల్ని రక్షిస్తారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

News December 27, 2025

రైతు రామారావు ఫ్యామిలీకి అండగా ఉంటాం: CBN

image

AP: తన సమస్యను చెప్పుకొని గుండెపోటుతో మరణించిన అమరావతి రైతు రామారావు కుటుంబ సభ్యులను CM CBN ఫోన్లో పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాగా నిన్న మంత్రి నారాయణ నిర్వహించిన సమావేశంలో రైతు <<18679475>>రామారావు<<>> ఒక్కసారిగా కుప్పకూలిపోవడం తెలిసిందే. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆయన మరణించారు.

News December 27, 2025

మండలాలు పక్క జిల్లాల్లోకి!

image

AP: <<18685889>>పునర్విభజనలో<<>> గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు నియోజకవర్గంలోని 5 మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాలని CM చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురంలో, రైల్వే కోడూరును తిరుపతిలో, పొదిలిని ప్రకాశంలో, రాజంపేటను కడపలో, రాయచోటి(అన్నమయ్య)ని మదనపల్లెలో విలీనం చేయాలన్న అంశంపైనా చర్చ జరిగింది. అటు ఆదోనిని రెండు మండలాలుగా విభజించాలని అభిప్రాయపడ్డారు.