News January 24, 2025

వైసీపీ చేసిన మంచిని ప్రజలకు బలంగా చెప్పాలి: సజ్జల

image

AP: వైసీపీ చేసిన మంచిని ప్రజలకు ఇంకా బలంగా చెప్పాలని ఆపార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ నేతలతో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. మీడియా అండతోనే అధికారంలోకి వస్తామనేది కేవలం అపోహ అని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మిసైల్స్‌లా దూసుకెళ్లాలన్నారు. టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని చెప్పారు.

Similar News

News December 20, 2025

ఈ నెల 24న కొడంగల్‌కు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24 తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. వారిలో ముఖాముఖితో పాటు గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. సీఎం పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.

News December 20, 2025

చిన్నారులకు HIV సోకిన రక్తం.. బాధ్యులకు ఏ శిక్ష విధించాలి?

image

MPలోని సాత్నా ప్రభుత్వాసుపత్రిలో తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి వేళ HIV సోకిన రక్తాన్ని ఎక్కించారు. రక్త సేకరణలో అజాగ్రత్తే దీనికి కారణం కాగా, బాధ్యులైన బ్లడ్ బ్యాంక్ ఇన్‌ఛార్జ్, ల్యాబ్ టెక్నీషియన్లు సస్పెండ్ అయ్యారు. అయితే చిన్నారుల బంగారు భవితను నాశనం చేసిన వీరికి ఏ శిక్ష విధిస్తే సరిపోతుంది? తమ పిల్లల్లైతే ఇలాగే చేస్తారా? తల్లిదండ్రులకు ఏం చెప్పి ఓదార్చగలం? అని నెటిజన్లు ఫైరవుతున్నారు.

News December 20, 2025

గుజరాత్‌లో SIR.. 73 లక్షల ఓట్లు తొలగింపు

image

గుజరాత్‌లో నిర్వహించిన SIRలో 73,73,327 ఓట్లను అధికారులు తొలగించారు. మొత్తం ఓటర్ల సంఖ్య 5.08 కోట్ల నుంచి 43.47 కోట్లకు తగ్గిందని డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ద్వారా తెలుస్తోంది. అభ్యంతరాలను జనవరి 18, 2026లోగా తెలియజేయాలి. వాటిని ఫిబ్రవరి 10లోగా అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారు. తొలగించిన ఓట్లలో 18 లక్షల మంది మరణించిన వారివి కాగా శాశ్వతంగా నివాసం మారిన ఓట్లు 40 లక్షలుగా గుర్తించారు.