News March 18, 2024
హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్

AP: గ్రూప్-1(2018) మెయిన్స్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. ఈ అప్పీల్ పిటిషన్పై రేపు విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా మెయిన్స్ పేపర్లను రెండు సార్లు మూల్యాంకనం చేశారని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో పరీక్షను రద్దు చేసింది.
Similar News
News February 3, 2026
మోహన్ బాబు, విష్ణుపై కిడ్నాప్ కేసు

AP: మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మోహన్బాబు, విష్ణు, వర్సిటీ పీఆర్వోపై తిరుచానూరు పీఎస్లో కిడ్నాప్ కేసు నమోదైంది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులపై ఆందోళన చేసిన విద్యార్థి నాయకులపై అక్కడి సిబ్బంది దాడి చేసి కిడ్నాప్ చేసినట్లు సమాచారం.
News February 3, 2026
‘భోలే బాబా’ను తెచ్చిన ఆలీబాబా ఎవరో తేలాలి: సత్యకుమార్

AP: పాలు లేకుండా కల్తీ నెయ్యి తయారు చేసేలా రూల్స్ మార్చి YCP బరి తెగించిందని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘TTD నెయ్యి కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు కలవలేదని YCP అంటోంది. అంటే కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్లే కదా? కల్తీ అయిందని జగన్ హయాంలో CFTRI తేల్చినా పట్టించుకోలేదు. భోలేబాబా డెయిరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తేలాలి.’ అని పేర్కొన్నారు. CMగా జగన్ అన్యమతస్థులను TTDలో నియమించారని విమర్శించారు.
News February 3, 2026
మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ(<


