News March 19, 2025

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

TG: బడ్జెట్‌లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున అందుతాయని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం బడ్జెట్‌గా రూ.24,439 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇప్పటికే మూడు ఎకరాల లోపు వారికి రైతు భరోసా నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News January 25, 2026

గ్రామస్థాయిలో జగన్ సైన్యం సిద్ధం చేస్తున్నాం: పూజిత

image

గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా గ్రామ స్థాయి నుంచి జగన్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నామని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. శనివారం నెల్లూరు గాంధీనగర్‌లో నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సమావేశ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అధికారం లేకపోయినా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజల సమస్యలపై పోరాడుతున్నారని కొనియాడారు.

News January 25, 2026

16 రోజుల డిజిటల్ అరెస్ట్.. రూ.14 కోట్లు స్వాహా

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ NRI దంపతుల నుంచి ఏకంగా రూ.14.84 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. తాము CBI, పోలీసులమని చెప్పి నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి ఢిల్లీలో నివసిస్తున్న 77 ఏళ్ల మహిళ, ఆమె భర్తను 16 రోజుల పాటు వీడియో కాల్‌లో నిరంతరం నిఘా పెట్టారు. భయంతో బాధితులు తమ పెట్టుబడుల నుంచి డబ్బును వారికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ కేసులో GJ, UP, ఒడిశా రాష్ట్రాల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News January 25, 2026

ఆర్సీబీ వరుస విజయాలకు ఢిల్లీ బ్రేక్

image

WPL-2026లో ఆర్సీబీ వరుస విజయాలకు ఢిల్లీ బ్రేక్ వేసింది. ఇవాళ జరిగిన మ్యాచులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు విఫలమైనా లారా(42*), రోడ్రిగ్స్(24), కాప్(19*) రాణించడంతో విజయం సొంతమైంది. ఈ గెలుపుతో DC పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. తొలి స్థానంలో ఆర్సీబీ(10P) ఉంది.