News March 19, 2025
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

TG: బడ్జెట్లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున అందుతాయని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం బడ్జెట్గా రూ.24,439 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇప్పటికే మూడు ఎకరాల లోపు వారికి రైతు భరోసా నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News October 23, 2025
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గైడ్లైన్స్ విడుదల

AP: NCTE నిబంధనల ప్రకారం TET నిర్వహించేలా GOVT గైడ్లైన్స్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లందరికీ టెట్ తప్పనిసరి చేసింది. టెట్ 2A, 2B (B.Ed) పేపర్లలో SC, ST, BC, PHCలకు అర్హత మార్కుల్లో మినహాయింపు ఈసారి లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ పాసవ్వాలి. అయితే వారికి నిర్దేశిత అర్హతల నుంచి మినహాయింపు ఇచ్చారు. డిటైల్డ్ గైడ్ లైన్స్ కోసం <
News October 23, 2025
‘మీ తాత కూడా ఇండియా నుంచే వచ్చాడు..!’

సామూహిక వలసలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ US రిపబ్లికన్ నేత నిక్కీ హెలీ కొడుకు నలిన్ హేలీ చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది. వలసలతో US పౌరులకు ఉద్యోగాలు లభించడంలేదన్నారు. దీంతో అతడికి బ్రిటీష్-అమెరికన్ జర్నలిస్ట్ మెహదీ హసన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘మీ తాత కూడా ఇండియా నుంచే వచ్చారు’ అని నలిన్కు గుర్తుచేశారు. నిక్కీ హెలీ తండ్రి అజిత్ సింగ్ రంధవా 1969లో అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
News October 23, 2025
ఇండియా టెక్ డెస్టినేషన్గా ఏపీ: CM CBN

డేటా సెంటర్లు, AI మెషీన్ లెర్నింగ్, ఫిన్టెక్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్సు వంటి రంగాల్లో పెట్టుబడులకు AP ఎంతో అనుకూలమని CM CBN తెలిపారు. ఇండియా టెక్ డెస్టినేషన్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. UAE టెక్ కంపెనీలతో కలిసి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అబుదబీలో నెట్వర్క్ లంచ్లో పాల్గొన్న ఆయన ఆ దేశ ఛాంబర్ ఛైర్మన్, ADNOC గ్లోబల్ ట్రేడింగ్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.