News July 6, 2024
రూ.40వేల కోట్ల రుణానికి ప్రభుత్వం కసరత్తు

TG: రైతు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా పథకాల అమలు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రుణమాఫీకి రూ.31వేల కోట్లు, రైతుభరోసా(ఎకరానికి రూ.7500)కు రూ.5వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.1500 కోట్లు అవసరం అవుతాయి. బాండ్లు, ప్రభుత్వ భూముల తాకట్టు, రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవాలా? అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. దేని ద్వారా ఎంత వరకూ వస్తాయనేది స్పష్టత వస్తే, మిగతాది సమీకరించనుంది.
Similar News
News March 10, 2026
ప్రభాస్ లేటెస్ట్ ఫొటో వైరల్

సినీ హీరో ప్రభాస్ లేటెస్ట్ ఫొటో SMలో వైరల్ అవుతోంది. ఆయనతో మలయాళం డైరెక్టర్ దిన్జిత్ అయ్యతాన్ దిగిన ఫొటో తాజాగా బయటికి వచ్చింది. ఇందులో ప్రభాస్ కొత్త హెయిర్ స్టైల్లో కనిపించారు. అటు ప్రభాస్తో మూవీ తీసేందుకు ఆసక్తి చూపుతున్న హోంబలే ఫిలిమ్స్ ఈ డైరెక్టర్ ద్వారా స్టోరీ వినిపించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన ఫౌజీ, కల్కి-2 మూవీల షూటింగ్లో బిజీగా ఉన్నారు.
News March 10, 2026
భారత్లో టాప్ శాలరీ ₹8కోట్లు!

దేశంలో AI, సెమీకండక్టర్స్, EV, బ్యాటరీ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల ఉద్యోగులకు డిమాండ్ ఉందని ఇండియా శాలరీ గైడ్ 2026 వెల్లడించింది. స్కిల్ను బట్టి సంస్థలు 30% వరకు హైక్ ఇస్తున్నాయంది. టాప్ శాలరీల్లో ఫైనాన్స్ రంగం గరిష్ఠంగా ₹8Cr/yr ఆఫర్ చేస్తోంది. ప్రైవేట్ ఈక్విటీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లోనూ భారీ జీతాలు ఉన్నాయంది. CEO స్థాయి వారికి శాలరీతో పాటు బోనస్/షేర్లతో అదనపు ఆదాయం ఉంటుంది.
News March 10, 2026
ఇండిగో సీఈఓ రాజీనామా

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు బోర్డ్ ఆమోదం తెలపగా ఆయన స్థానంలో ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా బాధ్యతలను చేపడతారు. డిసెంబరులో 2,500కుపైగా ఇండిగో విమానాలు క్యాన్సిల్ కావడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ రిజైన్ చర్చనీయాంశమైంది. ఈ క్రైసిస్పై కేంద్రం ఆ సంస్థకు జనవరిలో ₹22కోట్ల పెనాల్టీ విధించింది.


