News November 19, 2024
గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం

AP: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గతంలో వారు సమ్మె చేసిన కాలాన్ని డ్యూటీ పీరియడ్గా పరిగణిస్తూ ప్రభుత్వం జీతాలు విడుదల చేసింది. దీంతో సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్ యాదవ్కు PHC డాక్టర్ల సంఘం ధన్యవాదాలు తెలిపింది. కాగా సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పీజీ అడ్మిషన్లలో జీవో 85ను వ్యతిరేకిస్తూ వారంతా 10 రోజుల పాటు ఆందోళనలు చేశారు.
Similar News
News September 18, 2025
మోదీకి విషెస్ జెన్యూన్ కాదన్న యూట్యూబర్పై విమర్శలు

ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు చేసిన ట్వీట్లు జెన్యూన్ కాదని యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆరోపించారు. ప్రముఖులు విష్ చేసేలా ఆయన టీమ్ ముందే వారికి ‘టూల్ కిట్’ ఇచ్చిందన్నారు. దీంతో ధ్రువ్ రాథీపై మోదీ అభిమానులు ఫైరవుతున్నారు. ట్రంప్, మెలోనీ, పుతిన్ వంటి నేతలను కూడా ఆయన టీమ్ మ్యానేజ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, కేజ్రీవాల్కు కూడా ‘టూల్ కిట్’ ఇచ్చారా అని కౌంటర్ ఇస్తున్నారు.
News September 18, 2025
అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
News September 18, 2025
రాష్ట్రంలో 21 పోస్టులు

<