News February 9, 2025
GOOD NEWS చెప్పిన ప్రభుత్వం

AP: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు అర్హులైన వారి నుంచి వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. 2019 OCT 15 ముందు జరిగిన ఆక్రమణలకు సంబంధించే దరఖాస్తులు స్వీకరించనుండగా, లబ్ధిదారులు రుజువు పత్రాలు అందించాలి. మహిళల పేరుపై పట్టా, కన్వేయన్స్ డీడ్ అందించిన రెండేళ్ల తర్వాత ప్రభుత్వం యాజమాన్య హక్కులు ఇవ్వనుంది. 150 గజాల వరకు ఉచితంగా, ఆపై ఉంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Similar News
News January 26, 2026
అంబేడ్కర్ యూనివర్సిటీలో 53పోస్టులకు నోటిఫికేషన్

ఆగ్రాలోని <
News January 26, 2026
రేపు మధ్వనవమి.. ఎందుకు జరుపుతారంటే?

ద్వైత సిద్ధాంతకర్త, వాయుదేవుని మూడో అవతారమైన మధ్వాచార్యులు భౌతిక దేహంతో బదరీ క్షేత్రానికి పయనమైన పవిత్ర దినమే మధ్వనవమి. మాఘ శుక్ల నవమి నాడు ఉడిపి అనంతేశ్వరాలయంలో శిష్యులకు పాఠం చెబుతుండగా పుష్పవృష్టి కురిసి అదృశ్యమయ్యారు. హరియే సర్వోత్తముడని చాటిచెప్పిన ఆయన స్మరణార్థం నేడు మధ్వనవమి జరుపుకొంటాం. లోకానికి జ్ఞాన, భక్తి మార్గాలను అందించిన మహనీయుని పట్ల కృతజ్ఞతగా ఆయనకు విశేష పూజలు నిర్వహిస్తారు.
News January 26, 2026
కట్టె జనుములో కాయ తొలిచే పురుగు – నివారణ

రబీలో సాగు చేసే కట్టె జనుమును కాయ తొలిచే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటి నివారణకు పూత దశలో లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా క్లోరంట్రానిలిప్రోల్ 0.3ml కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ శిలీంద్రాల వల్ల విత్తనం రంగుమారడం, కుళ్లిపోవడం జరిగితే కాయ ఏర్పడే దశలో లీటరు నీటికి కార్బండిజం 1గ్రాము కలిపి పిచికారీ చేయాలి.


