News October 3, 2024
తిరుమల లడ్డూ వివాదంపై విచారణ వాయిదా

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు ఉ.10.30 గంటలకు విచారణ చేపడతామని తెలిపింది. దర్యాప్తుపై కేంద్రం అభిప్రాయం తెలిపేందుకు సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీంతో విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
Similar News
News March 7, 2026
నేపాల్లో ఛేంజ్.. భారత్కు కలిసొస్తుందా?

నేపాల్లో ఎన్నికల్లో బాలెన్ షా ఆధ్వర్యంలోని ప్రజా స్వతంత్ర పార్టీ గెలుపుదిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్తో నేపాల్ బంధం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమైంది. PM అభ్యర్థి అయిన షా జాతీయవాది. గతంలో భారత్ వ్యతిరేకత వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకున్నారు. కానీ గత పాలకుల తరహాలో చైనాకు ఫేవర్ లేకపోవడం భారత్కు కలిసొచ్చే విషయం. బ్యాలెన్స్డ్ ఫారిన్ రిలేషన్స్ కోరుకుంటున్నానని షా మ్యానిఫెస్టోలో చెప్పారు.
News March 7, 2026
వార్ ఎఫెక్ట్.. వంట గదిలో ధరల ‘మంట’

గల్ఫ్ యుద్ధం ప్రభావం ధరల రూపంలో మనపై పడుతోంది. తాజాగా సిలిండర్ <<19316911>>పెంపు<<>> దీనికి నిదర్శనం. భారత్తో పాటు జపాన్, చైనా, యూరప్ దేశాలకు ఖతర్ ఉత్పత్తి కేంద్రం నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(LNG), అనుబంధ ప్రొడక్టులు సప్లై అవుతాయి. వార్ నేపథ్యంలో ప్రొడక్టివిటీని నిలిపివేస్తున్నామని ఇటీవల ఖతర్ <<19299424>>ప్రకటించింది<<>>. దీంతో ఇప్పటికే యూరప్, ఆసియాలో గ్యాస్ ధరలు పెరగగా తాజాగా మన దేశంలోనూ సామాన్యులపై భారం పడింది.
News March 7, 2026
గ్యాస్ సరఫరా ఆపకండి.. IOCLకు TTD లేఖ!

AP: యుద్ధం వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగంపై కేంద్రం <<19309548>>నియంత్రణ<<>> నేపథ్యంలో TTD అధికారుల్లో ఆందోళన మొదలైంది. నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని IOCLను కోరింది. లేదంటే అన్న ప్రసాదాల తయారీతో పాటు ఇతర అవసరాలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందని లేఖ రాసినట్లు సమాచారం. TTDని ఆధ్యాత్మిక పరిధిలో ఉంచి సరఫరాను కొనసాగించాలని కోరగా IOCL సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.


