News March 28, 2025
వేడికి ఆగలేం.. కానీ చెట్లను బతకనీయం!

వేసవి వేడి మొదలైంది. బయటితో పోలిస్తే చెట్టు నీడలో ఉష్ణోగ్రత సగటున కనీసం 2 డిగ్రీలు తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ పల్లెటూళ్లలో సైతం ఇంటి ముందు ఖాళీ ఉంటే సిమెంట్తో అలికేస్తున్నాం తప్పితే చెట్లను ఎంతమంది పెంచుతున్నాం? ఆకులు రాలతాయనో, వేర్లు ఇంటిని కూల్చేస్తాయనో చాలామందిలో ఆందోళన. కనీసం ఖాళీ స్థలాల్లోనైనా వీలైనన్ని చెట్లు నాటితే భూతాపాన్ని తగ్గించినవారిమవుతాం. వృక్షో రక్షతి రక్షిత:
Similar News
News February 2, 2026
ఉడికించిన గుడ్డు/ ఆమ్లెట్.. ఏది మంచిదంటే?

గుడ్డులో ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లు, హెల్తీ ఫాట్స్ ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. అయితే ఉడికించిన గుడ్డు/ ఆమ్లెట్ ఏది తింటే ప్రయోజనమని చాలామందికి డౌట్ ఉంటుంది. బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఉడికించిన గుడ్డు తినాలంటున్నారు నిపుణులు. అలాగే ఆమ్లెట్ను తక్కువ నూనె, రకరకాల కూరగాయలతో చేయడం వల్ల రుచికరమైన పోషకాహారం అందుతుందంటున్నారు. ఎలా తిన్నా గుడ్డులోని పోషకాలు అందుతాయని చెబుతున్నారు.
News February 2, 2026
జోగి రమేశ్పై కేసు నమోదు

AP: మాజీ మంత్రి జోగి రమేశ్పై ఇబ్రహీంపట్నం పీఎస్లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్పై తీవ్ర <<19023498>>వ్యాఖ్యలు<<>> చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జోగి అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. కాగా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు జోగి రమేశ్ ఇంటికి నిప్పు అంటించిన ఘటనలోనూ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
News February 2, 2026
ఎరువుల ధరలు పెరిగే అవకాశం!

ఎరువుల తయారీలో కీలక ముడిపదార్థాలైన అమ్మోనియం ఫాస్పేట్, అమ్మోనియం నైట్రో ఫాస్పేట్, పొటాషియం సల్ఫేట్ లాంటి ఉత్పత్తులపై కేంద్రం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) మినహాయింపులను రద్దు చేసింది. దీని వల్ల DAP, NPK వంటి కాంప్లెక్స్ ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. ఫాస్పేట్, పొటాష్ ఆధారిత ఎరువుల ముడి సరుకులను మనం ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఈ తరుణంలో ఎరువుల ధరలు కూడా పెరిగే ఛాన్సుంది.


