News October 30, 2024
‘పోలవరం’ ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం?

AP: పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72M నుంచి కనీస నీటిమట్టం 41.15Mకే కేంద్రం పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకే ప్రాజెక్టు పూర్తి నిధులిచ్చేందుకు AUG 28న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఎత్తు తగ్గించడం వల్ల గరిష్ఠంగా 115.44TMCల నిల్వే సాధ్యమవుతుంది. వరద రోజుల్లో మినహా ఆయకట్టుకు నీటిని అందించడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.