News April 5, 2024
ఇటలీలో ‘కల్కి’ షూటింగ్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా మూవీ షూటింగ్కు సంబంధించిన ఫొటోలను హీరోయిన్ దిశా పటానీ ట్విటర్లో పంచుకున్నారు. ఇటలీలో జరిగిన సాంగ్ షూట్లో ప్రభాస్, నాగ్ అశ్విన్తో సరదాగా గడిపిన సన్నివేశాలను ఫొటోల్లో చూపారు. అయితే, సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు వార్తలొస్తుండటంతో సాంగ్ అయినా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News November 20, 2025
ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ను కలిసిన కేయూ JAC

కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్గా పి.భాస్కర్ నూతనంగా నియామకమయ్యారు. ఈ సందర్బంగా కేయూ జేఏసీ నాయకులు గురువారం ఆయనను కలిశారు. ప్రిన్సిపల్ను శాలువాతో సన్మానించి, పూలమొక్క అందచేసి, శుభాకాంక్షలు తెలిపారు. డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసం పనిచేయాలని, ఉన్నత శిఖరాలకు ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని వారు ప్రిన్సిపల్ను కోరారు.
News November 20, 2025
అందుకే రూపాయి పతనమైంది: RBI గవర్నర్

డాలర్కు డిమాండ్ పెరగడం వలనే రూపాయి పతనమైందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. రూపాయి విలువను నిర్దిష్టంగా లెక్కించడం లేదని స్పష్టం చేశారు. అమెరికన్ కరెన్సీకి విలువ పెరగడం వల్లే రూపాయి విలువ తగ్గిందన్నారు. మార్కెట్ ఎలా జరుగుతోంది అనే దానిపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని చెప్పారు. డాలర్కు డిమాండ్ పెరిగితే రూపాయి విలువ తగ్గినట్టే, రూపాయి డిమాండ్ పెరిగితే డాలర్ పతనమవుతుందని తెలిపారు.
News November 20, 2025
ఓట్ చోర్, SIRపై సందేహాలను నివృత్తి చేయాలి: మాజీ సీఈసీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్, SIR ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్పై ఉందని మాజీ సీఈసీ ఖురేషి తెలిపారు. ఆరోపణలపై పూర్తి స్థాయిలో నివృత్తి చేసి ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాన్ని కాపాడాలని కోరారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, ప్రత్యారోపణలు చేయడం సరైనది కాదని ఓ పాడ్కాస్ట్లో అన్నారు. 2010-12 మధ్య ఖురేషీ సీఈసీగా పని చేశారు.


