News October 20, 2024
పుష్పశ్రీవాణి ఎస్టీనే అని తేల్చిన హైకోర్టు

AP: మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ST కులానికి చెందిన వారేనని హైకోర్టు తీర్పునిచ్చినట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. DLSC కమిటీ రిపోర్ట్, స్టేట్ స్క్రూటినీ కమిటీ ఇచ్చిన జీవో 6ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటిషనర్ వద్ద ఆధారాలు లేవంటూ కేసు కొట్టివేసింది. కాగా ఆమె ST కాదంటూ ఇద్దరు వ్యక్తులు 2019లో పిటిషన్ వేశారు. ఓ వర్గం కావాలనే తప్పుడు ప్రచారం చేసిందని, చివరకు న్యాయమే గెలిచిందని పుష్పశ్రీవాణి అన్నారు.
Similar News
News January 4, 2026
ESIC బిబ్వేవాడిలో 20 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 4, 2026
ఆరోగ్యానికి బాదం ఇచ్చే 6 అద్భుత ప్రయోజనాలు!

పోషకాల గని అయిన బాదం తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేస్తాయి. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తూ బరువు తగ్గడానికి సాయపడతాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి, చర్మం, జుట్టు మెరిసేలా చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాత్రంతా నానబెట్టి పొట్టు తీసి తింటే అందులోని విటమిన్లు, మినరల్స్ ఒంటికి బాగా పడతాయి.
News January 4, 2026
BRS నేతలపై టీడీపీ MLA సోమిరెడ్డి ఆగ్రహం

గోదావరి జలాల్లో AP వాళ్లు ఒక్క బొట్టు వాడుకున్నా సహించేది లేదని BRS నేతలు అన్నారని TDP MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏడాదికి 3వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. BRSకు కౌంటర్గా రేవంత్ కూడా వాడుకోవద్దు అంటున్నారు. ఇది సరికాదు. గోదావరి నీళ్లు రాయలసీమకు ఇస్తామని KCR కూడా గతంలో అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సీఎంలిద్దరూ టీడీపీ వాళ్లే’ అని వ్యాఖ్యానించారు.


