News April 22, 2025

అత్యధిక పాస్ పర్సెంటేజ్ ఈ గ్రూప్‌లోనే..

image

TG: ఇవాళ విడుదలైన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో MPC గ్రూప్‌లోనే అత్యధిక మంది విద్యార్థులు పాసయ్యారు. అత్యల్పంగా HECలో పాస్ పర్సెంట్ నమోదైంది.
MPC: ఫస్టియర్‌- 76.65%, సెకండియర్‌ -72.23%
BPC: ఫస్టియర్‌- 67.88%, సెకండియర్‌ -71.93%
MEC: ఫస్టియర్‌- 65.53%, సెకండియర్‌ -56.96%
CEC: ఫస్టియర్‌- 45.56%, సెకండియర్‌ -46.92%
HEC: ఫస్టియర్‌- 34.51%, సెకండియర్‌ -46.26%

Similar News

News April 22, 2025

CM రేవంత్ వస్తేనే నా పెళ్లి: వైరా యువకుడు

image

TG: CM రేవంత్ వస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు భీష్మించుకొని కూర్చున్నాడు. సీఎం ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం ఫిక్స్ చేసుకుంటానన్నాడు. లేదంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటానని చెబుతున్నాడు. వైరాకు చెందిన భూక్యా గణేష్ అనే యువకుడు MLA రామ్‌దాస్ మాలోతుకు ఓ లెటర్ రాశాడు. తన పెళ్లికి CMను తీసుకొచ్చే బాధ్యత ఆయనదేనంటూ విన్నవించాడు. ఆ లెటర్‌ను MLA కూడా CMకు పంపాడు.

News April 22, 2025

J&Kలో ఉగ్రదాడి.. ఖండించిన సీఎంలు

image

J&Kలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘ఈ దుశ్చర్యను ఖండిస్తున్నాను. ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఉగ్రవాద మూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

News April 22, 2025

త్వరలో 18 APPSC నోటిఫికేషన్లు: ప్రభుత్వం

image

AP: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో 18 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు APPSC రెడీగా ఉన్నట్లు వివరించింది. ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు రోస్టర్ పాయింట్లు ఉంటాయంది. ఈ 18 నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!