News March 16, 2024
జిల్లాలో 5 ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

అనంతపురం జిల్లాలో 5 ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయినట్లు ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన స్థానంలో వాతావరణం విభాగం శాస్త్రవేత్త నారాయణస్వామి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తాడిపత్రి మండలంలోని తేరన్నపల్లిలో 41.22, హుస్సేన్ పురం 40.29, కళ్యాణదుర్గం 40.16, విడపనకల్లు 40.12, యల్లనూరు 39.90 ఉష్ణోగ్రత నమోదు అయిందన్నారు. ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు చేపట్టాలన్నారు.
Similar News
News March 12, 2026
అనంతపురం జిల్లాకు 24వ ర్యాంకు

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా ర్యాంకులు ప్రకటించారు. సంక్షేమ పథకాలు, అధికారుల పనితీరుపై అనంతపురం జిల్లా రాష్ట్రస్థాయిలో 24వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రజల సంతృప్తి స్థాయి 64.6 నుంచి 66.6 శాతానికి పెరిగింది. పనితీరులో మరింత పురోగతి సాధించి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
News March 12, 2026
అనంతపురం జిల్లాలో 2,75,642 మంది రైతులు అర్హులు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం కింద 2,75,642 మంది రైతుల అర్హుల జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లాకు రూ.163.26 కోట్లు కేటాయించగా అందులో అన్నదాత సుఖీభవ పథకానికి రూ.110.26 కోట్లు, పీఎం కిసాన్కు రూ.53.01 కోట్లు విడుదల చేయనున్నారు. జిల్లాలో అత్యధికంగా శింగనమల నియోజకవర్గంలో 54,338 రైతులకు అందించనున్నారు.
News March 12, 2026
రూ.20 కోట్లతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు

అనంతపురం నగరపాలక సంస్థ విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకునేందుకు సొంతంగా సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జస్వంత్ తెలిపారు. ఏటా రూ.10 కోట్ల వ్యయాన్ని ఆదా చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రూ.20 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విన్నపం మేరకు సీఎం చంద్రబాబు ఈ ప్లాంట్ కు సహకారం అందించారు.


