News July 6, 2024

బాలిక హత్య ఘటనపై హోం మంత్రి సీరియస్

image

AP: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో జరిగిన బాలిక హత్య ఘటనపై ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఈ దారుణ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆమె.. జిల్లా ఎస్పీని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు ముమ్మరంగా చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. కాగా, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రేమోన్మాది సురేశ్ నరికి చంపడం సంచలనంగా మారింది.

Similar News

News December 7, 2025

CSIR-CCMBలో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ &మాలిక్యులర్ బయాలజీలో 13 సైంటిస్టు పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 9 నుంచి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని జనవరి 6వరకు పోస్ట్ చేయాలి. నెలకు జీతం రూ.1,38,652 చెల్లిస్తారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్‌లో విద్యార్హత, వయసు, పరీక్ష విధానం వెల్లడించనున్నారు. వెబ్‌సైట్: https://www.ccmb.res.in/

News December 7, 2025

టెన్త్ విద్యార్థులకు శుభవార్త

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మార్చి వరకు సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. స్పెషల్ క్లాసులకు హాజరయ్యే వారికి రెండో శని, ఆదివారాల్లో మెనూ ప్రకారం భోజనం అందించాలని అధికారులను ఆదేశించింది.

News December 7, 2025

డ్రగ్స్‌తో పట్టుబడితే 20 ఏళ్ల జైలు: రవికృష్ణ

image

AP: సరదాల కోసం డ్రగ్స్‌కు అలవాటుపడి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని ఈగల్ IG రవికృష్ణ సూచించారు. ‘డ్రగ్స్ వాడుతూ పట్టుబడితే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఉద్యోగ అవకాశం కోల్పోతారు. జీవితాంతం దేశంలో ఎక్కడ ఉన్నా పోలీసు నిఘా ఉంటుంది. అనుమానం వస్తే తిరిగి జైలు తప్పదు’ అని హెచ్చరించారు. పిల్లలు డ్రగ్స్‌కు అలవాటుపడకుండా పేరెంట్స్ చూడాలన్నారు. డౌట్ వస్తే ‘1972’ నంబర్‌కి చెబితే రక్షించుకోవచ్చని తెలిపారు.