News April 11, 2024
నార్మల్ వాటర్ ఇవ్వలేదని హోటల్కు రూ.5వేలు ఫైన్!

కస్టమర్కు ఉచితంగా నీరు అందించకపోవడంతో హైదరాబాద్లోని జిల్లా వినియోగదారుల కోర్టు రూ.5 వేలు ఫైన్ వేసింది. కస్టమర్ నార్మల్ వాటర్ ఇవ్వాలని కోరగా.. కేవలం వాటర్ బాటిల్స్ ఉంటాయని చెప్పారు. అతను వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయగా.. GST, సర్వీస్ ఛార్జీలతో పాటు రూ.5వేలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. GHMC పరిధిలోని హోటల్స్, రెస్టారెంట్స్లో ఉచితంగా శుద్ధి చేసిన నీటిని అందించాలనే రూల్ ఉంది.
Similar News
News January 29, 2026
కేసీఆర్కు సిట్ నోటీసులు.. రేపు 3pmకు విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు సిట్ నోటీసులిచ్చింది. HYD నందినగర్లోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు CRPC 160 కింద మాజీ సీఎం పీఏకు నోటీసులు అందించారు. రేపు 3pmకు విచారణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. 65సం.లకు పైగా వయస్సు ఉండటంతో స్టేషన్కు రావడం తప్పనిసరి కాదని తెలిపారు. PSకు రావాలి అనుకుంటే రావచ్చు, లేదా HYD పరిధిలో ఆయన కోరిన చోట విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.
News January 29, 2026
ఆవనూనెతో చర్మ సంరక్షణ

ఆవనూనె, కొబ్బరి నూనె కలిపి ముఖంపై మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మొటిమలు రాకుండా ఉంటాయి. చర్మం నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు పావుకప్పు ఆవనూనెలో రెండు చుక్కల రోజ్ ఆయిల్ని కలపాలి. దీనికి చెంచా బియ్యప్పిండి చేర్చి పేస్ట్లా చేయాలి. దీన్ని ఒంటికి రాసుకుని నలుగులా రుద్దుకోవాలి. ఇది సహజమైన స్క్రబ్లా పనిచేస్తుంది. మృతకణాలు తొలగి మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
News January 29, 2026
మణిద్వీపం గురించి మీకు తెలుసా?

జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవి నివసించే ప్రదేశమే మణిద్వీపం. ఇది భౌతిక ప్రపంచానికి అతీతంగా వైకుంఠం, కైలాసం కంటే ఉన్నతమైనదని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు ఇక్కడ చింతామణి గృహంలో కొలువై ఉండి విశ్వాన్ని పాలిస్తుంటారు. మణిద్వీపం అంటే అమ్మవారు కాదు. అది ఆమె నివాసం ఉండే ద్వీపం. ఇక్కడ అనంత సంపదలు, రత్నాలు, పారిజాత వనాలు ఉంటాయి. మణిదీప వర్ణన చదివితే దారిద్య్రం తొలగి, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం.


