News March 19, 2024
రూ.వేలకోట్ల నిధులు ఉన్న షిప్పు కోసం వేట మొదలైంది..!

‘ఎల్ డొరాడో ఆఫ్ ది సీస్’గా పిలిచే బ్రిటన్ నౌక ‘ది మర్చంట్ రాయల్’ ఆచూకీ కోసం మళ్లీ అన్వేషణ మొదలైంది. బంగారం, వెండి నిధులను తరలిస్తుండగా 1641 సెప్టెంబరు 23న కార్న్వాల్ తీరాన ఈ నౌక నీట మునిగింది. అప్పుడు షిప్పులోని నిధుల విలువ రూ.42వేల కోట్లని అంచనా. దీని ఆచూకీ కోసం ఎంతోమంది విఫలయత్నం చేశారు. తాజాగా మల్టీబీమ్ సర్వీసెస్ సంస్థ సోనార్ టెక్నాలజీ, మానవరహిత సబ్మెరైన్లతో అన్వేషణ చేపట్టేందుకు సిద్ధమైంది.
Similar News
News November 23, 2025
పొల్యూషన్ నుంచి కాపాడే ఫుడ్స్ ఇవే

ప్రస్తుతం వాయుకాలుష్యం పెద్ద సమస్యగా మారింది. లైంగిక పరిపక్వత, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే బెర్రీస్, బ్రోకలీ, పసుపు, ఆకుకూరలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు కలిగిన విభిన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల కాలుష్యం నుంచి మిమ్మల్ని రక్షించుకోగలుగుతారని చెబుతున్నారు.
News November 23, 2025
స్మృతి మంధాన పెళ్లి వేదిక వద్దకు అంబులెన్స్.. పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్!

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్ పెళ్లి వేదిక వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. వేడుకలకు హాజరైన అతిథికి గుండెపోటు రావడంతో అంబులెన్స్లో సాంగ్లీలోని సర్వ్హిత్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి వివరాలు తెలియనప్పటికీ పెళ్లి పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై ఈవెంట్ ఆర్గనైజర్లు, కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు.
News November 23, 2025
భారత్vsదక్షిణాఫ్రికా.. రెండో రోజు ముగిసిన ఆట

గువాహటిలో దక్షిణాఫ్రికా, టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్సులో వికెట్లేమీ కోల్పోకుండా 9 పరుగులు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్సులో దక్షిణాఫ్రికా 489 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా పంత్ సేన 480 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో జైస్వాల్(7), రాహుల్(2) ఉన్నారు. రేపు దూకుడుగా ఆడి లీడ్ దిశగా సాగితేనే మ్యాచ్పై పట్టు బిగించే అవకాశం ఉంది.


