News March 19, 2024
రూ.వేలకోట్ల నిధులు ఉన్న షిప్పు కోసం వేట మొదలైంది..!

‘ఎల్ డొరాడో ఆఫ్ ది సీస్’గా పిలిచే బ్రిటన్ నౌక ‘ది మర్చంట్ రాయల్’ ఆచూకీ కోసం మళ్లీ అన్వేషణ మొదలైంది. బంగారం, వెండి నిధులను తరలిస్తుండగా 1641 సెప్టెంబరు 23న కార్న్వాల్ తీరాన ఈ నౌక నీట మునిగింది. అప్పుడు షిప్పులోని నిధుల విలువ రూ.42వేల కోట్లని అంచనా. దీని ఆచూకీ కోసం ఎంతోమంది విఫలయత్నం చేశారు. తాజాగా మల్టీబీమ్ సర్వీసెస్ సంస్థ సోనార్ టెక్నాలజీ, మానవరహిత సబ్మెరైన్లతో అన్వేషణ చేపట్టేందుకు సిద్ధమైంది.
Similar News
News December 3, 2025
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <
News December 3, 2025
పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే?

పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటూ, ఎత్తుకు తగ్గ బరువు పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మొదటి ఆరునెలలు తల్లిపాలు, తర్వాత రెండేళ్ల వరకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్తో కూడిని పోషకాహారం అందిస్తే ఇమ్యునిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అయోడిన్, ఐరన్ లోపం రాకుండా చూసుకోవాలంటున్నారు. వీటితో పాటు సమయానుసారం టీకాలు వేయించడం తప్పనిసరి.
News December 3, 2025
అమరావతికి రాజధాని హోదా.. కేంద్రం సవరణ బిల్లు

AP: అమరావతిని అధికారికంగా రాజధానిగా ప్రకటించేందుకు కేంద్రం సవరణ బిల్లును తీసుకొస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి న్యాయశాఖ ఆమోదం లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తే అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత ఏర్పడుతుంది.


