News December 10, 2024

ఆ హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంస‌న తీర్మానం

image

అల‌హాబాద్ హైకోర్టు జస్టిస్ శేఖ‌ర్ యాద‌వ్ తొల‌గింపున‌కు పార్ల‌మెంటులో అభిశంస‌న తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నిర్ణయించింది. దేశంలో మెజారిటీ ప్ర‌జ‌ల అభీష్టానికి పాల‌న సాగాలంటూ జడ్జి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఉభయ సభల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవసరమైన బలాన్ని కూడ‌గ‌ట్టేందుకు NC ప్రయత్నిస్తోంది. జడ్జి వ్యాఖ్య‌ల‌పై సుప్రీంకోర్టు కూడా నివేదిక కోరింది.

Similar News

News December 20, 2025

అన్ని మతాలు మాకు సమానమే: సీఎం రేవంత్

image

TG: ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి ఏసు ప్రభువు జన్మించారని CM రేవంత్ చెప్పారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందని తెలిపారు. ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే అసెంబ్లీ సమావేశంలో చట్టం తెస్తామన్నారు. రాష్ట్రంలో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని పేర్కొన్నారు.

News December 20, 2025

SM డిటాక్స్.. మెంటల్ హెల్త్‌కు బూస్ట్

image

ఒక వారం SMకు దూరంగా ఉంటే మెంటల్ హెల్త్ మెరుగవుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్టడీలో తేలింది. యాంగ్జైటీ 16.1%, డిప్రెషన్ 24.8%, ఇన్‌సోమ్నియా లక్షణాలు 14.5% తగ్గినట్టు గుర్తించింది. యువకులు రోజుకు 2గంటలు SM వాడుతున్నట్టు ఫోన్ డేటాతో తెలుసుకుంది. ‘డిటాక్స్ టైమ్‌లో SM వాడకం వారానికి 1.9hr నుంచి 30 నిమిషాలకు తగ్గింది. మిగిలిన టైమ్‌లో పలువురు బయటకు వెళ్లగా, కొందరు వర్కౌట్స్ చేశారు’ అని తెలిపింది.

News December 20, 2025

ALERT: ఈ వేరుశనగలు తింటే లివర్ క్యాన్సర్!

image

బూజు పట్టిన వేరుశనగలు తినడం ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వీటిలో ఉండే అఫ్లాటాక్సిన్ B1 అనే విషపూరిత రసాయనం కాలేయ కణాలను దెబ్బతీస్తుంది. ఇది శరీరంలోకి చేరితే తీవ్రమైన లివర్ ఫెయిల్యూర్‌కు దారితీయడమే కాకుండా, DNAను మార్పు చేసి భవిష్యత్తులో కాలేయ క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఆహార నిల్వ విషయంలో అప్రమత్తంగా ఉంటూ రంగు మారిన, బూజు పట్టిన గింజలను పారేయాలి’ అని సూచిస్తున్నారు. SHARE IT