News September 27, 2025
ఆకలి దప్పికలు తీర్చే అవతార రూపం

తిరుమల గిరిపై కొలువైన శ్రీనివాసుడు నేటి ఉదయం ఆకలి దప్పికలు తీర్చే అవతార మూర్తిగా దర్శనమిస్తాడు. ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో విహరిస్తాడు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోరిన కోర్కెలు తీర్చే వాహనంపై ఊరేగే మలయప్ప స్వామి దర్శనం పూర్వజన్మ సుకృతంతో సమానమని పండితులు చెబుతున్నారు. కల్పవృక్షం క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో ఒకటి.
Similar News
News February 8, 2026
క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ?

AP: అమరావతిలో క్వాంటం వ్యాలీకి నిన్న <<19077394>>శంకుస్థాపన<<>> పడిన వేళ క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏమిటి అనే చర్చ మొదలయింది. ఇది సంప్రదాయ కంప్యూటర్లకు మించిన శక్తిమంతమైనవి. ఇప్పటి కంప్యూటర్లు 0, 1 బిట్లపై పనిచేస్తే, క్వాంటం కంప్యూటర్లు క్యూబిట్స్పై ఆధారపడతాయి. క్యూబిట్ ఒకేసారి 0, 1గా ఉండగలగడం వల్ల అత్యంత వేగంగా పనిచేస్తాయి. మామూలు కంప్యూటర్లు కొన్ని ఏళ్లు చేసే పనిని ఇవి సెకన్లలోనే చేస్తాయి.
News February 8, 2026
క్వాంటం వ్యాలీతో నిరుద్యోగులకు లాభం ఏంటి?

AP: క్వాంటం వ్యాలీ ద్వారా నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టుతో దాదాపు లక్ష ఉద్యోగాలు వస్తాయని భావిస్తోంది. యువతకు క్వాంటం టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తామని చెప్తోంది. IITలు, గ్లోబల్ కంపెనీల భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్మెంట్ సాగనుందని, విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమరావతే టెక్ కెరీర్ కేంద్రంగా మారనుందని తెలిపింది.
News February 8, 2026
అసలైన ‘ధురంధరుడు’.. దేశం కోసం సర్వం త్యాగం చేసినా..

‘ధురంధర్’ మూవీ ట్రెండింగ్లో ఉండగా కశ్మీర్కు చెందిన భారత గూఢచారి రోషన్ లాల్ జల్లా స్టోరీ వైరల్ అవుతోంది. 1969, 1970, 1971లో పాకిస్థాన్ వెళ్లి విలువైన సమాచారాన్ని మన దేశానికి చేరవేశారు. ఇండియాకు తిరిగొస్తూ 1972లో పట్టుబడ్డారు. ఆయనను జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. 1987లో జైలు నుంచి రిలీజై ఇండియాకు రాగా ప్రభుత్వం చికిత్సకు డబ్బులివ్వలేదు. కనీసం పెన్షన్ కూడా ఇవ్వలేదు. 2021లో అనామకుడిగా మరణించారు.


