News January 24, 2025
భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. పిల్లలు ఏం చెప్పారంటే?

TG: మీర్పేట్కు చెందిన మాధవి హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మాధవి ఇద్దరు పిల్లల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. తమ తల్లి కనిపించకుండా పోయిన తర్వాత ఇంట్లో చెడు వాసన వచ్చినట్లు వారు పోలీసులకు తెలిపారు. అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నాడని చెప్పారు. మరోవైపు నిందితుడు చెప్పిన విషయాలపైనే కాకుండా పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 24, 2026
క్యాన్సర్తో నటుడు, మిస్టర్ ఇండియా మయాంక్ పవార్ మృతి

ప్రముఖ టీవీ రియాలిటీ షో ‘MTV Splitsvilla’ సీజన్ 7 కంటెస్టెంట్, ఏడుసార్లు మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ మయాంక్ పవార్ (37) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఫిట్నెస్ మోడల్గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మయాంక్ మరణవార్త విని ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరం అంటూ నివాళులర్పిస్తున్నారు.
News February 24, 2026
ముందు పోయేది కోడింగ్ జాబ్సే: ఆంథ్రోపిక్ CEO

ఏఐ ఆటోమేషన్ కారణంగా ముందుగా కోడింగ్ ఉద్యోగాలు పోతాయని ఆంథ్రోపిక్ CEO డారియో అమోడీ అంచనా వేశారు. సాఫ్ట్వేర్ రాయడంలో ఏఐ సిస్టమ్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. అయితే ఆర్కిటెక్చర్, ప్రొడక్ట్ సెన్స్, యూజర్ అండర్స్టాండింగ్ వంటివి ఆటోమేట్ కావడానికి కొంచెం సమయం పడుతుందని తెలిపారు. భవిష్యత్తులో 95% పనులు ఏఐ చేస్తుందని జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో వెల్లడించారు.
News February 24, 2026
ఇంటర్ ఎగ్జామ్స్.. సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి!

TG: రేపటి నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు 8:30AMలోపు సెంటర్కు చేరుకోవాలి. HYD వంటి నగరాల్లో ట్రాఫిక్ కారణంగా సెంటర్కు సమయానికి చేరుకోలేకపోవచ్చు. దానికి తగ్గట్లుగా ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకోండి. సెంటర్ అడ్రస్ కోసం హాల్టికెట్లపై ఉన్న QR కోడ్ను స్కాన్ చేస్తే డైరెక్ట్ మ్యాప్లో ఓపెన్ అవుతుంది. ఇంటర్ విద్యార్థులున్న తల్లిదండ్రులకు షేర్ చేయండి.


