News August 31, 2024
ట్రైనీ డాక్టర్పై హత్యాచార ఘటన.. నూడిల్స్ కావాలని నిందితుడి డిమాండ్

కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ జైలులో ఆహారంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజూ రోటీ సబ్జీ ఇస్తుండటంతో.. తనకు ఎగ్ నూడుల్స్ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. దీంతో జైలులో అందరికీ ఒకే ఆహారం ఇస్తామని, ప్రత్యేకంగా అడిగింది తెచ్చివ్వడం కుదరదని సిబ్బంది తెగేసి చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో సంజయ్ నోరుమూసుకుని ఇచ్చిన ఆహారం తీసుకున్నాడట.
Similar News
News December 25, 2025
RCB స్టార్ బౌలర్ యశ్ దయాల్కు షాక్

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న RCB స్టార్ బౌలర్ యశ్ దయాల్కు జైపూర్ పోక్సో కోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. విచారణ కీలక దశలో ఉండగా బెయిల్ సముచితం కాదని పేర్కొంది. క్రికెట్లో సలహాలిస్తానంటూ హోటల్కు పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు రాజస్థాన్కు చెందిన ఓ అమ్మాయి ఫిర్యాదుతో పోలీసులు దయాల్పై పోక్సో కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడే ఆస్కారముంది.
News December 25, 2025
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్

సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘థాయ్ కిళవి’ సినిమా కోసం పూర్తిస్థాయి గ్రామీణ వృద్ధురాలి పాత్రలో ఒదిగిపోయారు. మూవీ టీజర్ను రిలీజ్ చేస్తూ ‘ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో’ అంటూ ఆమె పాత్ర గురించి చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది.
News December 25, 2025
డిసెంబర్ 25: చరిత్రలో ఈ రోజు

✒ 1861: సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యా జననం
✒ 1924: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి(ఫొటోలో) జననం
✒ 1971: డైరెక్టర్ కరుణాకర్ జననం
✒ 1972: భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి మరణం
✒ 1974: ప్రముఖ నటి, రాజకీయ నేత నగ్మా జననం
✒ 1981: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ జననం
✒ సుపరిపాలన దినోత్సవం


