News October 22, 2024

ఈ ఉద్యోగుల ఆదాయం రూ.100-500 కోట్లు!

image

గత పదేళ్లలో రూ.500Cr పైగా Taxable Income చూపిన 23 మంది వ్యాపారులేనని TOI రిపోర్ట్ పేర్కొంది. రూ.100-500Cr బ్రాకెట్లో 262 మంది ఉండగా అందులో 19 మంది ఉద్యోగులు. ఇక AY2013-14లో రూ.500Cr+ పైగా ఆదాయం వస్తున్నట్టు ఒక్కరే ITR ఫైల్ చేశారు. AY2022-23తో పోలిస్తే గత అసెస్‌మెంట్ ఇయర్లో రూ.25Cr సంపాదనా పరులు 1812 నుంచి 1798కి తగ్గారు. రూ.10Cr కేటగిరీలో ఉద్యోగులు 1656 నుంచి 1577కు తగ్గారు. దీనిపై మీ కామెంట్.

Similar News

News October 22, 2024

ఆధార్ ఉన్న వారికి శుభవార్త

image

APలో ఇవాళ్టి నుంచి ప్రభుత్వం ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. గ్రామ, వార్డు సచివాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, అంగన్‌వాడీ సెంటర్లలో 4 రోజుల పాటు ఈ క్యాంపులు నిర్వహించనుంది. ఇందుకోసం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలంది. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్, డెమోగ్రాఫిక్ అప్‌డేట్, ఈ-ఆధార్ వంటి సేవలు అందించనున్నారు.

News October 22, 2024

వచ్చే 20 ఏళ్లలో 200కు పైగా ఎయిర్‌పోర్టులు: రామ్మోహన్ నాయుడు

image

AP: వచ్చే 20 ఏళ్లలో దేశంలో 200కు పైగా ఎయిర్ పోర్టులు వస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్-2024లో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో ఎయిర్ పోర్టుల సంఖ్య 74 నుంచి 157కి పెరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు ఐడియాలజీని అందుకోవడం తనకు కూడా కష్టంగా ఉందని చెప్పారు. విజన్ 2020తో పెను మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. HYDను ప్రపంచ స్థాయి నగరంగా మార్చారన్నారు.

News October 22, 2024

BRICS SIDELINES: మోదీ, జిన్‌పింగ్ భేటీ కాబోతున్నారా!

image

BRICS సదస్సు కోసం రష్యా వెళ్లిన PM నరేంద్ర మోదీతో చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఇప్పటికే దీనిపై హింట్ ఇవ్వడం గమనార్హం. ఏర్పాట్లపై ఫోకస్ పెట్టామన్నారు. గల్వాన్ లోయలో 2 దేశాల సైనికుల బాహాబాహీ తర్వాత జిన్‌పింగ్‌ను కలిసేందుకు మోదీ ఆసక్తి చూపలేదు. నిన్ననే LAC వద్ద డిస్‌ఎంగేజ్‌మెంట్ ఫైనలైజ్ అవ్వడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.