News November 7, 2024

గోవాకు విదేశీయుల తాకిడి త‌గ్గుతోంది!

image

విహారం, విడిది కోసం గోవాకు వచ్చే విదేశీయుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కరోనా ప్యాండమిక్ త‌రువాత ఈ ట్రెండ్ పెరిగింది. 2019లో గోవాకు 9.4 ల‌క్ష‌ల మంది విదేశీయులు విచ్చేశారు. అయితే 2023లో ఆ సంఖ్య 4.03 ల‌క్ష‌లకు తగ్గింది. ఇది 60 శాతం త‌గ్గుద‌ల‌ను సూచిస్తోంది. గోవాలో ట్యాక్సీ మాఫియా వ‌ల్ల కొంద‌రు విదేశీయులు దోపిడీకి గుర‌య్యామ‌ని భావించడం, ఇత‌ర‌త్రా అసౌక‌ర్యాల వ‌ల్ల గోవా రావడం తగ్గించినట్టు తెలుస్తోంది.

Similar News

News November 5, 2025

కార్తీక పౌర్ణమి.. ఈరోజు ఉపవాసం ఉండాలా?

image

కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. ‘ఇవాళ తె.జా.4.52-ఉ.5.44 మధ్య నదీ స్నానం చేసి, వెంటనే కార్తీక దీపాలు వదలాలి. ఉపవాసం ఉండాలి. ఆహారం తీసుకోకుండా ఉండలేనివారు పాలు, పండ్లు తీసుకోవడం మేలు. సత్యనారాయణస్వామి కథ వినడం లేదా చదవడం శుభప్రదం. సాయంత్రం శివాలయాలు, విష్ణు మందిరాల్లో 365వత్తులతో దీపారాధన చేయాలి. ఇందుకు సా.5.15-రా.7.05 మధ్య మంచి సమయం. దీపారాధన తర్వాత ఉపవాసం విరమించాలి’ అని పండితులు చెబుతున్నారు.

News November 5, 2025

సిగ్నల్ జంప్ వల్లే రైలు ప్రమాదం!

image

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ రైల్వే స్టేషన్ సమీపంలో <<18197940>>రైలు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ప్రయాణికుల రైలు బోగీ గూడ్స్ రైలు పైకి ఎక్కడం ప్రమాద తీవ్రతను పెంచింది. ప్యాసింజర్ రైలు రెడ్ సిగ్నల్ జంప్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వేబోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది.

News November 5, 2025

కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుతారు?

image

పరమేశ్వరుడి కీర్తిని విని ద్వేషంతో రగిలిపోయిన త్రిపురాసురుడు కైలాసంపైకి దండయాత్రకు వెళ్లాడు. మూడ్రోజుల భీకర పోరాటం తర్వాత ఈశ్వరుడు ఆ అసురుడిని సంహరించాడు. దీంతో వేయి సంవత్సరాల పాటు సాగిన అసుర పాలన అంతమైంది. దేవతల భయం కూడా తొలగిపోయింది. దీంతో అభయంకరుడైన శివుడు ఆనందోత్సాహాలతో తాండవం చేశాడు. ఈ ఘట్టం జరిగింది కార్తీక పౌర్ణమి నాడే కాబట్టి.. ప్రతి సంవత్సరం ఈ శుభదినాన శివుడిని అత్యంత భక్తితో పూజిస్తాము.