News January 29, 2025

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

image

AP: మహా కుంభమేళాలో తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది తరలిరావడంతో అర్ధరాత్రి సెక్టార్-2 వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది మరణించారు.

Similar News

News November 22, 2025

పాపాల నుంచి విముక్తి కోసం..

image

తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామసహస్రం మే శృణు పాప భయాపహమ్ ||సమస్త లోకాలకు ఆధారభూతుడైన, ఏకైక ప్రభువైన విష్ణుమూర్తి వేయి నామాలను తప్పక ఆలకించాలని భీష్మాచార్యుల వారు ఉద్బోధించారు. ఈ పవిత్ర నామాలను శ్రద్ధతో వినడం వలన పాప కర్మలు, జన్మ,మృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం. శాశ్వత శాంతిని, సకల శుభాలను పొందడానికి విష్ణు సహస్ర నామ పారాయణ సులభమైన మార్గమంటారు.<<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 22, 2025

GREAT: బ్యాగులో రూ.10,00,000.. అయినా పైసా ముట్టలేదు!

image

పుణే(MH)కు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు అంజు మనే గొప్ప మనసు చాటుకున్నారు. గురువారం చెత్త ఏరుతుండగా ఆమెకు ఓ బ్యాగ్ దొరికింది. అందులో డబ్బు, మెడిసిన్లు కనిపించాయి. అది ఎవరిదో కనుక్కునేందుకు ఆ వీధి అంతా తిరిగింది. ఓ వ్యక్తి టెన్షన్‌తో కనిపించడంతో అతడికి వాటర్ ఇచ్చింది. బ్యాగ్ దొరికిందని ఇచ్చేసింది. అందులో రూ.10 లక్షల క్యాష్ ఉంది. దీంతో ఆమె నిజాయతీకి మెచ్చిన బ్యాగ్ యజమాని చీర, కొంత డబ్బు ఇచ్చాడు.

News November 22, 2025

ఈ నెల 25 నుంచి 17వ పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన

image

దక్షిణాసియాలోనే అతిపెద్ద 17వ పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన ఈ నెల 25-28 వరకు HYDలోని HICCలో జరగనుంది. దీనికి 1,500 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, 50 దేశాల నుంచి 500లకు పైగా ఎగ్జిబిటర్లు, 40 వేలకు పైగా సందర్శకులు హాజరుకానున్నారు. పౌల్ట్రీరంగంలో సమస్యలు, AI, ఆటోమేషన్, ఉపాధి వంటి అంశాలపై సెమినార్లు నిర్వహిస్తారు. ఈ సదస్సుకు హాజరుకావాలని CM రేవంత్‌రెడ్డికి నిర్వాహకులు ఆహ్వానం అందించారు.