News January 26, 2025
అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం

AP: అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు ACA అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. ‘అహ్మదాబాద్ స్టేడియం(1.10 లక్షల సీటింగ్)కంటే పెద్దదిగా అమరావతి స్టేడియం(1.25లక్షల సీటింగ్) ఉంటుంది. 60 ఎకరాల్లో రూ.800 కోట్ల వ్యయంతో దీనిని నిర్మిస్తాం. అమరావతిలో 200 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేస్తాం. 2027కల్లా IPLకు ఏపీ నుంచి 15 మంది ఎంపికయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


