News September 17, 2024

వచ్చే ఏడాది నుంచి ‘ఇంటర్’ ఎత్తివేత!

image

TG: NEP-2020లో భాగంగా రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యావిధానాన్ని ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై విద్యార్థులకు 5+3+3+4 విధానం అమలు చేయాలని చూస్తోంది. తొలి ఐదేళ్లలో అంగన్‌వాడీ, ప్రీస్కూల్ మూడేళ్లతో పాటు 1,2 తరగతులుంటాయి. ఆ తర్వాతి మూడేళ్లు 3,4,5 క్లాసులు, ఆపైన 6,7,8 తరగతులు చదవాలి. చివరి నాలుగేళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9,10,11,12 తరగతుల్లో చేరాలి.

Similar News

News December 8, 2025

మావోయిస్టు కీలక నేత లొంగుబాటు.. MMCలో ఉద్యమం అంతం!

image

మావోయిస్టు పార్టీ కీలక నేత రామ్‌ధేర్ మజ్జీ సహా 12 మంది ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రామ్‌ధేర్ మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (MMC) జోన్‌‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇతడిపై రూ.3 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. రామ్‌ధేర్ లొంగుబాటుతో MMC జోన్‌లో మావోయిజం అంతమైనట్లేనని భావిస్తున్నారు.

News December 8, 2025

NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్‌మెంట్‌లో 5 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల వారు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి BE, B.tech, PG(అగ్రి బిజినెస్), M.COM, CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: nccd.gov.in.

News December 8, 2025

ఇంటి చిట్కాలు మీ కోసం..

image

* నిమ్మచెక్కతో మైక్రోవేవ్ పైభాగాన్ని శుభ్రం చేస్తే మచ్చలు త్వరగా పోతాయి.
* స్టెయిన్ లెస్ స్టీలుకు బేబీ ఆయిల్ రాస్తే గీతలు పడకుండా దృఢంగా ఉండడమే కాదు కొత్తదానిలా తళతళలాడుతుంది.
* ఫ్రిజ్లో తరిగిన నిమ్మకాయ ముక్క పెడితే సువాసనలు వెదజల్లుతుంది.
* ఇంట్లోని సింకు బ్లాక్ అయితే సోడియం బైకార్బొనేట్‌తో పాటు ఒక బాటిల్ వైట్ వెనిగర్ ని కూడా వేస్తే నీళ్లు సింకులోంచి వేగంగా పోతాయి.