News December 1, 2024
హీరోయిన్లు సమంత, కీర్తి సురేశ్ను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్ను HYD జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సస్టెయిన్ కార్ట్ సంస్థను స్థాపించి సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతో పెట్టుబడులు పెట్టించి మోసగించాడు. శిల్పారెడ్డి అనే మహిళ మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడింది. అతడు సుమారు రూ.100 కోట్లకుపైగా దోచుకున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లు సమంత, కీర్తి సురేశ్, పరిణీతి చోప్రా, డిజైనర్ శిల్పారెడ్డి సహా పలువురు ఇతడి బాధితులే.
Similar News
News November 5, 2025
‘మీర్జాగూడ’ ప్రమాదం.. బస్సును 60 మీటర్లు ఈడ్చుకెళ్లిన టిప్పర్

TG: రంగారెడ్డి(D) మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేగంగా దూసుకొచ్చిన కంకర టిప్పర్.. బస్సును ఢీకొట్టిన తర్వాత 50-60M ఈడ్చుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. బ్రేక్ వేయకపోవడం లేదా పడకపోవడం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే డ్రంకెన్ డ్రైవ్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 24 మంది చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
News November 5, 2025
ఫ్రీ బస్సు హామీ.. న్యూయార్క్లో విజయం

న్యూయార్క్ (అమెరికా) మేయర్గా <<18202940>>మమ్దానీ గెలవడంలో<<>> ఉచిత సిటీ బస్సు ప్రయాణ హామీ కీలకపాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే బస్ లేన్స్, వేగం పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. వాటితో పాటు సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు పెంచి ఉద్యోగులపై ట్యాక్సులను తగ్గిస్తామని చెప్పారు. నగరంలో ఇంటి అద్దెలను కంట్రోల్ చేస్తామని హామీ ఇవ్వడం ఓటర్లను ఆకర్షించింది.
News November 5, 2025
ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగాలు

<


