News August 22, 2024
యాజమాన్యం నా కాల్స్కూ స్పందించట్లేదు: హోంమంత్రి

AP: అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం విషయంలో పరిశ్రమ యాజమాన్యం తప్పిదం ఉందని ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ‘17మంది కన్నుమూయడం బాధాకరం. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం. నేను కాల్ చేసినా, మెసేజ్ పెట్టినా యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరగాలి. తరచూ ప్రమాదం జరిగే సెజ్ ప్రాంతాల్లో ఆస్పత్రుల్ని నిర్మించాలి’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
Similar News
News December 4, 2025
మామిడిలో జింకు లోపం – లక్షణాలు

సాధారణంగా చౌడు నేలల్లోని మామిడి తోటల్లో జింకు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి పాలిపోయి చనిపోతాయి. పెరుగుదల దశలో జింకు లోపముంటే ఆకులు చిన్నవిగా మారి సన్నబడి పైకి లేదా కిందకు ముడుచుకుపోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గిపోయి, ఆకులు గులాబీ రేకుల వలే గుబురుగా తయారవుతాయి. మొక్కల పెరుగుదల క్షీణించి కాయల పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది.
News December 4, 2025
భారీ జీతంతో ఉద్యోగాలు

తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ (<
News December 4, 2025
తల్లిపై కూతురు పోటీ.. విషాదాంతం

TG: రాజకీయాలు కుటుంబ సంబంధాలనూ విచ్ఛిన్నం చేస్తున్నాయి. నల్గొండ(D) ఏపూరులో తల్లీకూతురు మధ్య నెలకొన్న రాజకీయ వివాదం విషాదాంతమైంది. 3వ వార్డు అభ్యర్థులుగా తల్లి లక్ష్మమ్మను BRS, ఆమె కూతురు అశ్వినిని కాంగ్రెస్ బలపరిచింది. ఈ క్రమంలో కూతురు నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరాయి. దీంతో లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


