News August 22, 2024
యాజమాన్యం నా కాల్స్కూ స్పందించట్లేదు: హోంమంత్రి

AP: అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం విషయంలో పరిశ్రమ యాజమాన్యం తప్పిదం ఉందని ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ‘17మంది కన్నుమూయడం బాధాకరం. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం. నేను కాల్ చేసినా, మెసేజ్ పెట్టినా యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరగాలి. తరచూ ప్రమాదం జరిగే సెజ్ ప్రాంతాల్లో ఆస్పత్రుల్ని నిర్మించాలి’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
Similar News
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.
News September 18, 2025
విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ

ఇంటర్నేషనల్ టీ20ల్లో నమీబియా ఓపెనర్ ఫ్రైలింక్ విధ్వంసం సృష్టించారు. జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో కేవలం 13 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు మొత్తం 31 బంతుల్లో 77 రన్స్ చేసి ఔట్ అయ్యారు. 6 సిక్సర్లు, 8 ఫోర్లు బాదారు. ఫ్రైలింక్ బాదుడుతో నమీబియా 20 ఓవర్లలో 204/7 రన్స్ చేసింది. ఛేజింగ్లో జింబాబ్వే ఎదురొడ్డుతోంది.