News February 9, 2025
ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్తో నిలిచిన మ్యాచ్.. ఇంగ్లండ్ ఫ్యాన్స్ సెటైర్లు

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్ కారణంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఎవరైనా ఎలక్ట్రీషియన్ స్టేడియంలో దగ్గరలో ఉంటే రావాలని ENG ఫ్యాన్స్ వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారు. ప్రపంచంలోనే రిచ్ క్రికెట్ బోర్డు ఇలాంటి వసతులతో మ్యాచ్ నిర్వహిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మ్యాచ్ ఆగితే ఇంగ్లండ్ ఓటమి నుంచి గట్టెక్కుతుందని కొందరు భారత ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.
Similar News
News December 7, 2025
ఆరోగ్యం గురించి చెప్పే మొటిమలు

ముఖంపై వచ్చే మొటిమలను బట్టి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చంటున్నారు నిపుణులు. కనుబొమ్మల మధ్య తరచూ మొటిమలు వస్తుంటే లివర్ సమస్యలు ఉన్నట్లు, నుదుటిమీద వస్తుంటే జీర్ణ సమస్యలు, ముక్కు చుట్టూ వస్తుంటే గుండె సమస్యలు, గడ్డం భాగంలో వస్తుంటే హార్మోన్ల అసమతుల్యత, చెవుల చుట్టూ వస్తుంటే కిడ్నీ రిలేటెడ్ సమస్యలు ప్రారంభమై ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మొటిమలనూ పట్టించుకోవాలని సూచిస్తున్నారు.
News December 7, 2025
గోవాకు వెళ్తున్నారా? జాగ్రత్త

2023లో HYD యువతి (30) పెళ్లికి ముందు ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడ బస ఏర్పాట్లు చేసిన యశ్వంత్ అనే వ్యక్తి తాజాగా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడితో గడిపిన వీడియోలను రికార్డు చేశానని, రూ.30 లక్షలు ఇవ్వకుంటే బయటపెడతానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిందని చెప్పినా వినట్లేదని వాపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 7, 2025
టెన్త్, ఇంటర్ అర్హతతో NGRIలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<


