News September 19, 2024

పవన్‌తో ముగిసిన బాలినేని, సామినేని భేటీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వైసీపీ మాజీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను భేటీ ముగిసింది. ఈ నెల 22న జనసేనలో చేరుతున్నట్లు ఉదయభాను ప్రకటించారు. జనసేన బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మరోవైపు త్వరలో ఒంగోలులో కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్‌ను ఆహ్వానించి జనసేనలో చేరతానని బాలినేని తెలిపారు. అందరినీ కలుపుకుని ఆ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

Similar News

News November 24, 2025

ఎన్నికలకు సిద్ధం.. కోర్టుకు తెలపనున్న Govt, SEC

image

TG: పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు ఇవాళ HCలో విచారణకు రానుంది. కోర్టు ఆదేశాలకు తగ్గట్లు ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, 50% రిజర్వేషన్లు మించకుండా GOలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పనుంది. అటు పూర్తి ఏర్పాట్లు చేశామని, అధికారులు, సిబ్బంది సమాయత్తంపై ఎన్నికల సంఘం వివరించనుంది. నిన్నటి నుంచి గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్లపై మండల ఆఫీసుల్లో లిస్టులను అధికారులు ప్రదర్శనకు ఉంచారు.

News November 24, 2025

రైజింగ్ స్టార్స్ కప్ గెలిచిన పాక్.. INDపై ట్రోల్స్!

image

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ విజేతగా PAK A నిలిచింది. ACC ఛైర్మన్ నఖ్వీ ఆ జట్టుకు ట్రోఫీ అందించగా, ఆ ఫొటోలు పోస్ట్ చేస్తూ PAK ఫ్యాన్స్ టీమ్ ఇండియాను ట్రోల్ చేస్తున్నారు. ‘పక్క దేశం వాళ్లకు ఇది ఇంకా నెరవేరని కలే’ అంటూ పోస్టులు పెడుతున్నారు. వాటికి IND ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. కాగా SEPలో ఆసియా కప్ గెలిచిన అనంతరం నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు IND నిరాకరించిన సంగతి తెలిసిందే.

News November 24, 2025

ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలపై అప్‌డేట్

image

APలో పంచాయతీ పాలక వర్గాలకు 2026 MAR వరకు గడువుండగా, MPTC, ZPTCల పదవీకాలం SEPతో ముగియనుంది. FEB, MARలో SSC, ఇంటర్ పరీక్షలు ఉండటంతో ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరగొచ్చు. పరిషత్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం SEP/OCTలో జరగొచ్చని అంచనా. కాగా రిజర్వేషన్ల ఖరారు కోసం వచ్చే నెలలో ప్రభుత్వం డెడికేషన్ కమిషన్‌‌ను ఏర్పాటు చేయనుంది. అధ్యయనం, అభిప్రాయ సేకరణ అనంతరం కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారవుతాయి.