News March 24, 2024
పాలు చెడిపోయాయి.. రూ.77 వేలు ఉఫ్

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఆన్లైన్ గ్రాసరీ యాప్ నుంచి పాలు ఆర్డర్ చేసింది. అయితే పాలు చెడిపోవడంతో రిటర్న్ చేద్దామని ప్రయత్నించిన ఆమెకు షాక్ తగిలింది. ఇంటర్నెట్లో కనిపించిన కస్టమర్ కేర్ నంబరుకు కాల్ చేసింది. ఓ వ్యక్తి కస్టమర్ కేర్ ప్రతినిధిగా మాట్లాడి డబ్బులు రిఫండ్ చేస్తామని నమ్మించాడు. ఆమె బ్యాంకు ఖాతా వివరాలు రాబట్టి రూ.77వేలు దోచేశాడు. దీంతో ఆమె సైబర్ పోలీసుల్ని ఆశ్రయించింది.
Similar News
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News December 4, 2025
‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానం!

TG: <<18457165>>హిల్ట్<<>> పాలసీ లీకేజీపై విజిలెన్స్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. ఈ లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తోంది. సీఎంఓలోని ఓ అధికారిని నిన్న రాత్రి టీమ్ విచారించినట్లు తెలుస్తోంది. అటు BRSతో పాటు ఓ కీలక బీజేపీ నేతకు కూడా సమాచారం లీక్ అయినట్లు టాక్. ఉన్నతాధికారుల ప్రమేయంపై క్లారిటీ రావాల్సి ఉంది. CM ఈ విషయమై సీరియస్గా ఉండటంతో క్లారిటీ వస్తే కారకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశముంది.


