News August 2, 2024
బీబీఏ కోర్సు కనీస ఫీజు రూ.18,000

AP: రాష్ట్రంలోని 35 ఇంజినీరింగ్ కాలేజీల్లో తొలిసారి ప్రవేశపెట్టిన బీబీఏ, బీసీఏ డిగ్రీ కోర్సుల కనీస ఫీజును రూ.18వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25, 2025-26కు ఈ ఫీజులు వర్తిస్తాయని ఉత్తర్వులిచ్చింది. మరోవైపు నిన్నటి నుంచి డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఆప్షన్ల ఎంపికకు 5వ తేదీ వరకు ఛాన్స్ ఉంటుంది. 10న సీట్లు కేటాయించి, 12 నుంచి క్లాసులు ప్రారంభిస్తారు.
Similar News
News December 7, 2025
‘EU’ని రద్దు చేయాలి: ఎలాన్ మస్క్

యూరోపియన్ కమిషన్ ‘X’కు 140 మిలియన్ డాలర్ల <<18483215>>ఫైన్<<>> విధించడంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ‘యూరోపియన్ యూనియన్ను రద్దు చేయాలి. సార్వభౌమాధికారాన్ని దేశాలకు తిరిగి ఇవ్వాలి. తద్వారా ప్రభుత్వాలు తమ ప్రజలకు బాగా ప్రాతినిధ్యం వహించగలుగుతాయి’ అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్ను ఓ యూజర్ షేర్ చేయగా.. ‘నా ఉద్దేశం అదే.. నేను తమాషా చేయట్లేదు’ అని పునరుద్ఘాటించారు.
News December 7, 2025
డిసెంబర్ 07: చరిత్రలో ఈ రోజు

1792: భారత్లో పోలీసు వ్యవస్థను ప్రవేశపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ
1896: తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి సూర్యనారాయణమూర్తి జననం
1975: డైరెక్టర్ సురేందర్ రెడ్డి జననం
2013: హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(ఫొటోలో) మరణం
*భారత సాయుధ దళాల పతాక దినోత్సవం
*అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం
News December 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


