News July 18, 2024

‘ఇంజినీరింగ్’ కనీస ఫీజు రూ.43వేలు

image

AP: ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజును ప్రభుత్వం రూ.43 వేలకు పెంచింది. రూ.45వేలు ఇవ్వాలని యాజమాన్యాలు కోరగా, రూ.43 వేలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఫీజులు తగ్గించడంతో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా, 2023 జూన్‌లో ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిఫారసు చేసిన ఫీజులను అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో చర్చల అనంతరం కనీస ఫీజు రూ.43వేలుగా ఖరారైంది.

Similar News

News December 23, 2025

పూజల్లో ‘వక్క’ సమర్పిస్తున్నారా?

image

‘వక్క’ అత్యంత పవిత్రమైనది. పూజలో దీనిని అఖండంగా(ముక్కలు చేయకుండా) ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు. తద్వారా పూర్తి ఫలితం లభిస్తుందంటున్నారు. ‘దీన్ని దేవతలకు ప్రతీకగా భావిస్తారు. ఇది దైవంతో మనకున్న బలమైన బంధానికి, విధేయతకు చిహ్నం. ఆయుర్వేద పరంగానూ ఇది చాలా ఉపయోగకరం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలి పెంచుతుంది. యజ్ఞాల్లో తమలపాకుతో కలిపి వక్క సమర్పిస్తే కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

News December 23, 2025

నేటి నుంచి జగన్ పులివెందుల పర్యటన

image

AP: వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ 4pmకు పులివెందుల చేరుకొని భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 24న ఉదయం ఇడుపులపాయకు వెళ్లి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 1pmకు మళ్లీ పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 25న 8.30amకు CSI చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరవుతారు. 10.30amకు పులివెందుల నుంచి తిరుగుపయనమవుతారు.

News December 23, 2025

ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్లు?

image

IPLతో పాటు WPLలో ఢిల్లీ జట్లకు కెప్టెన్లు మారనున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. IPLలో గత సీజన్‌లో DCకి అక్షర్ సారథ్యం వహించగా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. దీంతో కెప్టెన్సీ తీసుకోవాలని రాహుల్‌ను ఫ్రాంచైజీ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గత సీజన్‌లోనే సారథిగా చేయాలని భావించినా ఆయన ఆసక్తి చూపలేదు. అటు WPLలో మెగ్ లానింగ్‌ను కెప్టెన్‌గా తప్పించి జెమీమాకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.