News September 6, 2025

టెస్లా కారు కొన్న మంత్రి.. ‘స్వదేశీ’ ఏమైంది?

image

భారత్‌లో తొలి టెస్లా Y మోడల్ కారును మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ <<17619296>>కొనుగోలు<<>> చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. మంత్రులే ప్రధాని మాటను లెక్కచేయకపోతే ఎలా అని నిలదీస్తున్నారు. టాటా, మహీంద్రా లాంటి కంపెనీలు కనబడట్లేదా అని ఫైరవుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News September 6, 2025

విష్ణువు దశావతారాలు ఎందుకు ఎత్తారు? (1/2)

image

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విష్ణువు దశావతారాలు ఎత్తారు. సృష్టి ప్రళయానికి గురైనప్పుడు, వేదాలను కాపాడేందుకు మత్స్య రూపంలో వచ్చారు. క్షీరసాగర మథన సమయంలో మందరగిరిని మోయడానికి తాబేలు అవతారంలో వచ్చారు. భూమిని కాపాడేందుకు వరాహ రూపం, భక్త ప్రహ్లాదుణ్ని కాపాడి, హిరణ్యకశిపుణ్ని చంపేందుకు నరసింహుని రూపం ఎత్తారు. బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచి లోకాలను అధీనంలోకి తెచ్చుకోవడానికి వామనుడిగా వచ్చారు.

News September 6, 2025

విష్ణువు దశావతారాలు ఎందుకు ఎత్తారు? (2/2)

image

క్షత్రియ జాతిలో పెరిగిన అహంకారాన్ని అణిచివేయడానికి విష్ణువు పరశురాముని అవతారం ఎత్తారు. ధర్మాన్ని నిలబెట్టడానికి, రావణుణ్ని సంహరించి ధర్మ స్థాపన చేయడానికి రామునిగా వచ్చారు. దుష్టులను శిక్షించడానికి, మహాభారత యుద్ధంలో ధర్మాన్ని రక్షించడానికి కృష్ణునిగా వచ్చారు. శాంతి సందేశాన్ని ప్రచారం చేయడానికి బుద్ధుని అవతారం ఎత్తారు. కలియుగం అంతంలో ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి కల్కి రూపంలో అవతరిస్తారని నమ్మకం.

News September 6, 2025

నేడు ఈ వ్రతం చేస్తే సకల శుభాలు

image

కష్టాల నుంచి విముక్తి పొంది సకల శుభాలు కలగాలంటే నేడు అనంత పద్మనాభ వ్రతం చేయాలని పండితులు చెబుతున్నారు. భాద్రపద శుద్ధ చతుర్దశినాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే పుణ్య ఫలాలు లభిస్తాయని అంటున్నారు. ‘శ్రీకృష్ణుడే స్వయంగా ఈ వ్రతం గురించి పాండవులకు చెప్పారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సంపదలు కలుగుతాయి. ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించి, అనంత పద్మనాభుని కృపకు పాత్రులైతే అంతర్గత శాంతి లభిస్తుంది’ అని సూచిస్తున్నారు.