News July 3, 2024

విధులకు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం

image

TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలోని పలు విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11 గంటలైనా విధులకు హాజరుకాని ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండెన్స్ బుక్‌ను పరిశీలించిన ఆయన, ప్రతి ఉద్యోగి విధిగా సమయానికి రావాలని ఆదేశించారు.

Similar News

News March 13, 2026

వారు రక్తదానం చేయడంపై నిషేధం కొనసాగుతుంది: కేంద్రం

image

ట్రాన్స్‌జెండర్లు, పురుషులతో లైంగిక సంబంధం ఉన్న పురుషులు, సెక్స్ వర్కర్ల రక్తదానంపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. HIV, హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిబంధనలు అవసరమని తెలిపింది. ఇది వివక్ష కాదని స్పష్టం చేసింది. కేవలం లైంగిక గుర్తింపు ఆధారంగా రక్తదానాన్ని నిరాకరించడం చట్టవిరుద్ధమని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో కేంద్రం వివరణ ఇచ్చింది.

News March 13, 2026

ఫ్లాష్ ఫ్లడ్స్‌ను 24hrs ముందే అంచనా వేయొచ్చు: పిచాయ్

image

పట్టణాల్లో ఆకస్మిక వరదలను 24hrs ముందే అంచనా వేసే ‘గ్రౌండ్ సోర్స్’ అనే కొత్త AI మోడల్‌ను రూపొందించినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. ‘జెమినీ’ సాయంతో ఇది 150+ దేశాల్లో 26లక్షల వరద సంఘటనలను విశ్లేషించిందని తెలిపారు. శాస్త్రవేత్తల పరిశోధనలు, ప్రజల సేఫ్టీ కోసం ఈ డేటాను గూగుల్ <>’ఫ్లడ్ హబ్<<>>’లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఏరియా పేరు సెర్చ్ చేయాలి. ముప్పు ఉంటే రెడ్ మార్క్ చూపిస్తుంది.

News March 13, 2026

సీక్వెల్ సినిమాకి డైరెక్టర్‌గా బోయపాటి?

image

‘అఖండ-2’ తర్వాత బోయపాటి శ్రీను చేసే తర్వాత సినిమా ఏంటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. సన్నీ డియోల్‌తో ‘జాట్-2’ డైరెక్ట్ చేయమని ఆయన్ను మైత్రీ సంస్థ సంప్రదించినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘జాట్’కు ఇది సీక్వెల్‌గా రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఆఫర్‌ను తీసుకుంటారా? వదులుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.