News July 13, 2024
పెన్షన్ల రికవరీపై స్పందించిన మంత్రి

TG: దాసరి మల్లమ్మకు వృద్ధాప్య పెన్షన్ రికవరీ <<13620026>>నోటీసుపై<<>> మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. ‘ANMగా చేస్తూ కుమార్తె చనిపోవడంతో మల్లమ్మకు నెలకు రూ.24,073 కుటుంబ పెన్షన్ వస్తోంది. ఇదే సమయంలో ఆమె వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటోంది. ఒకే వ్యక్తి రెండు పెన్షన్లు పొందడం రూల్స్కు విరుద్ధం. 1,826 మంది 2 పెన్షన్లు పొందుతున్నట్లు ట్రెజరీ గుర్తించి నోటీసులిచ్చింది’ అని ఆమె వెల్లడించారు.
Similar News
News November 22, 2025
అచ్చంపేట: ASI మహేశ్ మృతి

అచ్చంపేట పట్టణంలో ఇంటెలిజెన్స్ విభాగంలో ఏఎస్సైగా పని చేస్తున్న మహేశ్ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కింద పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అతడి మృతితో పోలీస్ డిపార్ట్మెంట్లో విషాదఛాయాలు అలుముకున్నాయి. పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
News November 22, 2025
APR 1 నుంచి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్: సీఎం

AP: క్యాబినెట్ ఆమోదం తెలిపిన యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని 2026 APR 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని CM చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం NTR వైద్య సేవ ద్వారా ఏ ప్రాంతంలో, ఏ వ్యాధికి ఎంత ఖర్చు చేస్తున్నామో విశ్లేషించాలని సూచించారు. కాగా కొత్త పథకంతో 1.63 కోట్ల కుటుంబాలకు రూ.2.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం, అందులో 1.43 కోట్ల BPL కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షల ఉచిత వైద్యం అందుతుంది.
News November 22, 2025
బాలికలకు సంతూర్ స్కాలర్షిప్.. రేపే లాస్ట్ డేట్

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో అందించే సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. AP, మహారాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థినులు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. వీరికి 30వేల రూపాయలు అందుతుంది.
వెబ్సైట్: <


