News March 1, 2025

భూమిపై ఎక్కువ మంది మాట్లాడే భాషలివే!

image

ప్రపంచంలోని దాదాపు 58 దేశాల్లో 150 కోట్ల మంది ఇంగ్లిష్ మాట్లాడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 2023 లెక్కల ప్రకారం.. చైనీయులు మాట్లాడే మండరిన్ భాషను 110 కోట్ల మంది, ఇండియన్స్ ఎక్కువగా మాట్లాడే హిందీని 60.9 కోట్ల మంది వినియోగిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో స్పానిష్‌ (55 కోట్లు), ఫ్రెంచ్‌ (30.98 CR), అరాబిక్‌ (27.40 CR), బెంగాలీ (27.2 CR), పోర్చుగీసు (26.36 కోట్లు), రష్యన్ (25.50 కోట్లు) ఉన్నాయి.

Similar News

News January 29, 2026

సిమెంట్ ఉత్పత్తిలో భారత్ సత్తా.. మన దగ్గరే ఎక్కువ!

image

ప్రపంచ సిమెంట్ ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచిందని ఎకనామిక్ సర్వే 2025-26 పేర్కొంది. ప్రస్తుతం దేశీయంగా 690M టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా AP, TG సహా 12రాష్ట్రాల్లోనే 85% పరిశ్రమలున్నాయి. అయితే ప్రపంచ సగటు తలసరి వినియోగం 540Kgs ఉండగా మన దేశంలో 290 కిలోలుగానే ఉంది. ప్రభుత్వాలు రోడ్లు, రైల్వే, గృహనిర్మాణ పథకాలపై దృష్టి సారించడం వల్ల సిమెంట్ వాడకం పెరుగుతుందని సర్వే పేర్కొంది.

News January 29, 2026

ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

image

ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>IFCI<<>>) 6 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. B.Com/BBA ఫైనాన్స్ అర్హత గలవారు JAN 31వరకు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తును ఈ మెయిల్ contract@ifciltd.comకు సెండ్ చేయాలి. వయసు 20- 28 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.15వేలు స్టైపెండ్ చెల్లిస్తారు. షార్ట్ లిస్ట్, ఇంటరాక్షన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.ifciltd.com

News January 29, 2026

రీసర్వేతో 86వేల సరిహద్దు వివాదాలు పరిష్కారం: ఎకనమిక్ సర్వే

image

AP: రాష్ట్రంలోని 6,901 గ్రామాల్లో 81 లక్షల భూకమతాలను రీసర్వే చేసినట్లు ఎకనమిక్ సర్వే వెల్లడించింది. 86 వేల సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయని పేర్కొంది. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ ఇచ్చినట్లు తెలిపింది. APలో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. APతోపాటు పంజాబ్, UP, గుజరాత్‌కు విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది.