News December 3, 2024
మహిళా కానిస్టేబుల్ హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు

TG: RR(D) ఇబ్రహీంపట్నంలో కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో నిందితుడు పరమేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఆస్తిలో వాటా <<14770190>>అడగనని <<>>బాండ్ రాసివ్వాలని సోదరుడు పరమేశ్ గతంలో చేసిన ఒత్తిడికి ఆమె అంగీకరించలేదు. దీనికి తోడు తన పెళ్లి రద్దవడం మరో కారణం. నాగమణి కులాంతర వివాహం చేసుకోవడం, పొలం వివాదం ఉండటంతో అమ్మాయి తరఫు వారు పెళ్లి రద్దు చేసుకున్నారు. దీంతో అక్కపై కక్ష పెంచుకుని, మాటు వేసి హతమార్చాడు.
Similar News
News March 30, 2026
నామినేషన్ వేసిన CM స్టాలిన్, విజయ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ కొలత్తూరు నుంచి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. అటు తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత, నటుడు విజయ్ దళపతి కూడా పెరంబూరు నియోజకవర్గానికి సంబంధించి చెన్నైలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
News March 30, 2026
చైనా సీసీటీవీలపై దేశంలో బ్యాన్?

ఏప్రిల్ 1 నుంచి హిక్విజన్, దహువా, TP-Link తదితర చైనా CCTV కెమెరాలు, పరికరాలను దేశంలో బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలో అమ్మే CCTV ప్రొడక్టులు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చైనా సంస్థలు, ఆ దేశంలో తయారైన చిప్సెట్లను ఉపయోగించే పరికరాలకు పర్మిషన్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నట్లు సమాచారం.
News March 30, 2026
సల్మాన్- వంశీ పైడిపల్లి సినిమా.. ఏప్రిల్ నుంచి షూటింగ్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న సినిమా కన్ఫర్మ్ అయింది. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడిస్తూ సల్మాన్, వంశీ ఉన్న ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. SVC బ్యానర్పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా సల్మాన్ సరసన నటి నయనతార కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఈ కాంబో ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.


