News June 22, 2024
పేరు మారినా ఆలోచనా విధానం మారలేదు: ముద్రగడ కూతురు

AP: తన తండ్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకున్నా ఆలోచనా విధానం మాత్రం మార్చుకోలేదని ఆయన కూతురు క్రాంతి ట్వీట్ చేశారు. మాజీ సీఎం జగన్ను ప్రశ్నించని ఆయనకు పవన్ను ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. పవన్కు సమాజానికి ఏం చేయాలో స్పష్టత ఉందని, తన తండ్రికి లేదనిపిస్తోందని చెప్పారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు.
Similar News
News December 10, 2025
ప్రేమ పేరుతో మోసం చేసిందని మహిళా డీఎస్పీపై ఫిర్యాదు

రాయ్పూర్ డీఎస్పీ కల్పన వర్మ తనను మోసం చేశారని ఆరోపిస్తూ బిజినెస్మ్యాన్ దీపక్ టాండన్ కేసు పెట్టారు. 2021లో ప్రేమ పేరుతో రిలేషన్షిప్లోకి దింపి, బ్లాక్మెయిల్ చేసి తన నుంచి రూ.2 కోట్ల డబ్బు, డైమండ్ రింగ్, కారు, గోల్డ్ చైన్, లగ్జరీ గిఫ్ట్స్, తన హోటల్ ఓనర్షిప్ రాయించుకున్నట్టు ఆరోపించారు. క్రిమినల్ కేసులు పెడతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ ఆరోపణలను కల్పన వర్మ ఖండించారు.
News December 10, 2025
ఇండిగో ఎఫెక్ట్.. ఢిల్లీ ఎకానమీకి రూ.1000 కోట్ల నష్టం

ఇండిగో సంక్షోభంతో ఢిల్లీలోని పలు వ్యాపార రంగాలు రూ.1000 కోట్లు నష్టపోయాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తెలిపింది. ట్రేడర్స్, టూరిస్ట్స్, బిజినెస్ ట్రావెలర్స్ తగ్గారని CTI ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ చెప్పారు. వారం రోజుల్లో ఢిల్లీలోని హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్టుల్లో చాలా బుకింగ్స్ రద్దయ్యాయన్నారు. ఆటో మొబైల్స్, హోమ్ నీడ్స్, చేనేత వస్త్రాల ప్రదర్శనలకు సందర్శకులు కరవయ్యారని తెలిపారు.
News December 10, 2025
డ్రై స్కిన్ కోసం ఈ ఫేస్ ప్యాక్

డ్రై స్కిన్ ఉన్న వాళ్లకి చర్మంలో తేమ తగ్గి ముడతలు త్వరగా వచ్చేస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే టేబుల్స్పూన్ కీరదోస గుజ్జులో, టీస్పూన్ ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కీరదోసలోని నీరు ముఖ చర్మంలోకి ఇంకిపోయి పొడిదనం క్రమంగా తగ్గుతుంది. చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంది.


