News March 16, 2024
2019లో ఓటర్ల సంఖ్య అలా.. ఇప్పుడిలా..!

ఓటర్ల వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. 2019 ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 89.6 కోట్లు కాగా, ప్రస్తుతం అది 96.8 కోట్లుగా ఉంది. ఇందులో పురుష ఓటర్లు 46.5 కోట్లు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 49.7 కోట్లకు చేరింది. మహిళా ఓటర్ల సంఖ్య 2019లో 43.1 కోట్లు ఉంటే.. ఇప్పుడు 47.1 కోట్లకు చేరింది. ఇక ట్రాన్స్జెండర్ల సంఖ్య 39,683 నుంచి 48,044కు.. దివ్యాంగ ఓటర్ల సంఖ్య 45.64 లక్షల నుంచి 88.35 లక్షలకు చేరింది.
Similar News
News December 9, 2025
పిల్లలు మొండిగా చేస్తున్నారా?

కొందరు పిల్లలు ఊరికే అలుగుతుంటే వారిని తిట్టడం లేదా చేయి చేసుకోవడం వల్ల వారు మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల సాధ్యమై నంత వరకు వారిని బుజ్జిగిస్తూ, దారిలోకి రాకపోతే చిన్నగా బెదిరించాలి. కానీ చేయి చేసుకోవడం, తిట్టడం వల్ల మాట వినరంటున్నారు నిపుణులు. వారిని ప్రేమతో పెంచాలి. ఇంట్లో ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి. అప్పుడే పిల్లలు మొండితనం వీడతారని చెబుతున్నారు.
News December 9, 2025
ప్రియురాలి వీడియో వైరల్.. హార్దిక్ పాండ్య ఆగ్రహం

బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లపై టీమ్ ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రెస్టారెంట్ మెట్లు దిగి వస్తుండగా తన ప్రియురాలు మహికా శర్మను అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీయగా అవి వైరలయ్యాయి. దీంతో చీప్ సెన్సేషనలిజమ్ కోసం ఇలా దిగజారడం సరికాదని ఇన్స్టాలో పాండ్య ఫైరయ్యారు. మహిళలను గౌరవించాలని హితవు పలికారు. ఇకపై ఫొటోలు తీసేటప్పుడు మైండ్ఫుల్గా ప్రవర్తించాలన్నారు.
News December 9, 2025
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అసిమ్ మునీర్

పాకిస్థాన్ తొలి రక్షణ దళాల చీఫ్ (CDF)గా నియమితులైన అసిమ్ మునీర్ మరోసారి భారత్ లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఏదైనా దాడి జరిగితే పాక్ ప్రతిస్పందన ఈసారి మరింత వేగంగా, తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా అణుబాంబు బెదిరింపులు సహా గతంలో కూడా <<18043029>>మునీర్<<>> ఇలాంటి కామెంట్స్ చేశారు.


