News April 7, 2024

ఓటర్ల సంఖ్య పెరుగుతోంది!

image

AP: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఈనెల 2 వరకు కొత్తగా 1,26,549 ఓటర్లు నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మహిళా ఓటర్ల సంఖ్య 2,08,49,730 నుంచి 2,09,16,389కి పెరిగిందని, పురుష ఓటర్ల సంఖ్య 2,00,84,276 నుంచి 2,01,44,166కి పెరిగినట్లు తెలిపింది. కొత్త ఓటర్ల నమోదుకు ఇంకా అవకాశం ఉండడంతో ఓటర్ల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.

Similar News

News November 18, 2025

అమిత్ షా డెడ్‌లైన్‌కి ముందే హిడ్మా ఎన్‌కౌంటర్!

image

AP: అల్లూరి(D) మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్‌లైన్‌ కంటే ముందే ఇది జరిగిందని తెలుస్తోంది. 2026 మార్చి 31నాటికి దేశంలో నక్సలిజాన్ని రూపుమాపాలని అమిత్ షా గడువు విధించిన విషయం తెలిసిందే. అప్పుడే NOV 30లోపు హిడ్మా ఎన్‌కౌంటర్ జరగాలని ఆదేశాలిచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

News November 18, 2025

అమిత్ షా డెడ్‌లైన్‌కి ముందే హిడ్మా ఎన్‌కౌంటర్!

image

AP: అల్లూరి(D) మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్‌లైన్‌ కంటే ముందే ఇది జరిగిందని తెలుస్తోంది. 2026 మార్చి 31నాటికి దేశంలో నక్సలిజాన్ని రూపుమాపాలని అమిత్ షా గడువు విధించిన విషయం తెలిసిందే. అప్పుడే NOV 30లోపు హిడ్మా ఎన్‌కౌంటర్ జరగాలని ఆదేశాలిచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

News November 18, 2025

వాట్సాప్‌లో ‘మీ-సేవ’.. Hi అని పంపితే చాలు!

image

TG: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ ద్వారా మీ-సేవా సర్వీసులను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందే అవకాశముంది. 80969 58096 నంబర్‌కు Hi అని మెసేజ్ చేసి సేవలు పొందవచ్చు. ఇన్‌కం, బర్త్, క్యాస్ట్, డెత్ సర్టిఫికెట్ల దరఖాస్తుతో పాటు విద్యుత్, నీటి బిల్లులు, ఆస్తి పన్నులు చెల్లించవచ్చు.