News October 11, 2025

పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ లక్ష్యాలివే..

image

పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రధాని మోదీ పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత మిషన్‌ను ఇవాళ ప్రారంభించారు. ఈ పథకం కింద 2030-31 నాటికి పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 275 నుంచి 310 లక్షల హెక్టార్లకు పెంచాలన్నదే కేంద్రం లక్ష్యం. పప్పు ధాన్యాల ఉత్పత్తి 242 నుంచి 350 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం, హెక్టారుకు పంట ఉత్పాదకత 881 KGల నుంచి 1,130 KGలకు పెంచడం కేంద్రం లక్ష్యం.

Similar News

News October 11, 2025

బొత్సకు వైసీపీ నుంచే ప్రాణహాని: పల్లా

image

AP: వైసీపీ ఎమ్మెల్సీ <<17973709>>బొత్స<<>> సత్యనారాయణకు కూటమి నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని TDP చీఫ్‌ పల్లా శ్రీనివాస్‌ అన్నారు. ఆయనకు సొంత పార్టీ నుంచే ప్రాణహాని ఉండొచ్చని కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని బొత్స చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మండలిలో బొత్స కొంత రాణించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే జగన్‌ నుంచి ప్రాణహాని ఉండొచ్చని పేర్కొన్నారు. బొత్స భద్రత కావాలని కోరితే CM నిర్ణయం తీసుకుంటారన్నారు.

News October 11, 2025

విద్యార్థినిపై అత్యాచారం.. వెలుగులోకి సంచలన విషయాలు

image

ఒడిశా విద్యార్థినిపై <<17976156>>అత్యాచారం <<>> కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ విచారం వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని WB సీఎం మమతను కోరారు.

News October 11, 2025

పాత ఫోన్‌ను అమ్ముతున్నారా? చిక్కుల్లో పడ్డట్లే!

image

పాత ఫోన్లకు ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు ఇస్తామంటూ వీధుల్లోకి వచ్చే వారికి మొబైళ్లను అమ్మారో మీరు చిక్కుల్లో పడ్డట్లే. ఆ ఫోన్లను వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఫోన్ల నుంచి ఇతరులకు ఓటీపీలు, మెసేజ్‌లు పంపి వారి BANK ఖాతాల్ని ఖాళీ చేస్తున్నారు. ఇవి అమ్మిన వారి పేరిట ఉండడంతో తప్పించుకుంటున్నారు. కాగా ఇలాంటి మరో ముఠా దుమ్ముగూడెం పోలీసులకు చిక్కింది.