News March 20, 2024
అదిరిపోనున్న ఐపీఎల్ ప్రారంభ వేడుకలు

ఐపీఎల్ సీజన్-17 ఆరంభానికి సిద్ధమైంది. రెండున్నర నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. ఈ నెల 22న ఆర్సీబీ, సీఎస్కే జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ను గ్రాండ్గా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, సోను నిగమ్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్లు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. ఎల్లుండి సా.6.30 నుంచి లైవ్ ప్రారంభంకానుంది.
Similar News
News September 9, 2025
ఏడాది క్రితమే ఈవీఎంల వినియోగంపై కమిటీ: SEC సాహ్ని

AP: ఏడాది క్రితమే ఈవీఎంల వినియోగంపై ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసిందని SEC నీలం సాహ్ని తెలిపారు. ‘S-3 మోడల్ ఈవీఎంలో మెమరీ డ్రైవ్ తీసి వెంటనే మరొక చోట వాడుకునే అవకాశం ఉంటుంది. రాబోయే ఎన్నికల కోసం 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయి. 10,670 M-2 మోడల్ ఈవీఎంలు ఇప్పటికే మనవద్ద ఉన్నాయి. ఒకవేళ ఈవీఎంలు అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి తీసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.
News September 9, 2025
నూతన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ నేపథ్యం

C.P.రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. ఈయన 1957లో తమిళనాడులో జన్మించారు. 16ఏళ్ల వయసు నుంచే RSS, జన్ సంఘ్లో పని చేశారు. 1998, 99లో కోయంబత్తూరు BJP నుంచి MPగా గెలిచారు. 2004, 14, 19లో ఓడిపోయారు. 2004-07 వరకు తమిళనాడు BJP అధ్యక్షుడిగా పని చేశారు. 2023లో ఝార్ఖండ్ గవర్నర్ అయ్యారు. 2024లో TG గవర్నర్గానూ అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జులైలో MH గవర్నర్గా పని చేశారు.
News September 9, 2025
బ్రెవిస్ జాక్పాట్.. ఏకంగా రూ.8 కోట్లు

సౌతాఫ్రికా క్రికెటర్ బ్రెవిస్ జాక్పాట్ కొట్టారు. SA20 సీజన్ 4 వేలంలో అతడిని ప్రిటోరియా క్యాపిటల్స్ రూ.8.30 కోట్లకు దక్కించుకుంది. లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. బేబీ ఏబీగా గుర్తింపు పొందిన బ్రెవిస్ ప్రస్తుతం IPLలో చెన్నై తరఫున ఆడుతున్నారు. నో లుక్ సిక్సర్లు కొట్టడంలో ఈ చిచ్చర పిడుగు దిట్ట. అటు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ మార్క్రమ్ను డర్బన్ సూపర్ జెయింట్స్ రూ.7 కోట్లకు దక్కించుకుంది.