News September 8, 2024
నేటితో ముగియనున్న పారిస్ పారాలింపిక్స్

పారిస్ పారాలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పోటీలు 11 రోజులపాటు కొనసాగాయి. 216 పతకాలతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ 29 పతకాలతో 16వ ప్లేస్లో ఉంది. మొత్తం 4,463 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. 22 క్రీడల్లో 549 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఇండియా నుంచి 84 మంది అథ్లెట్లు పారాలింపిక్స్లో పాల్గొన్నారు. 25 పతకాలు సాధించాలనే లక్ష్యాన్ని మన దేశం నెరవేర్చుకుంది.
Similar News
News December 7, 2025
50 ఏళ్ల నాటికి సరిపోయేలా ‘ఒంటిమిట్ట’ అభివృద్ధి

AP: పురాతన ఒంటిమిట్ట కోదండ రామాలయం అభివృద్ధిపై TTD ప్రత్యేక మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తోంది. మరో 50 ఏళ్లలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది. వసతి, రవాణా, కల్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్ర వనాలు, మ్యూజియమ్, ఉద్యానవనాలు, డిజిటల్ స్క్రీన్స్, కళామందిరం, 108Ft జాంబవంతుడి విగ్రహం, మాడ వీధుల అభివృద్ధి, CC కెమెరాలు వంటి వాటిపై EO సింఘాల్ అధికారులకు సూచించారు.
News December 7, 2025
RGSSHలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఢిల్లీలోని <
News December 7, 2025
DEC9న ‘విజయ్ దివస్’ నిర్వహణ: KTR

TG: KCR ఆమరణ దీక్ష వల్ల 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షకు ఒక రూపం వచ్చిందని BRS నేత KTR పేర్కొన్నారు. ‘11 రోజుల దీక్ష ఫలించి DEC9న ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చింది. KCR త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఆరోజును విజయ దివస్గా సంబరాలు జరుపుకోవాలి’ అని పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్సులో పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలున్నందున గ్రామాల్లో కాకుండా నియోజకవర్గాల్లో జరపాలన్నారు. ఏ కార్యక్రమాలు చేపట్టాలో ఆయన వివరించారు.


