News September 8, 2024

నేటితో ముగియనున్న పారిస్ పారాలింపిక్స్

image

పారిస్ పారాలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పోటీలు 11 రోజులపాటు కొనసాగాయి. 216 పతకాలతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ 29 పతకాలతో 16వ ప్లేస్‌లో ఉంది. మొత్తం 4,463 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. 22 క్రీడల్లో 549 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఇండియా నుంచి 84 మంది అథ్లెట్లు పారాలింపిక్స్‌లో పాల్గొన్నారు. 25 పతకాలు సాధించాలనే లక్ష్యాన్ని మన దేశం నెరవేర్చుకుంది.

Similar News

News October 31, 2025

పశువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదకర వ్యాధి

image

బ్రూసిల్లా అబార్టస్‌ బ్యాక్టీరియా వల్ల పశువులకు సోకే ప్రమాదకర వ్యాధి బ్రూసెల్లోసిస్‌. ఈ వ్యాధి వల్ల పశువుల్లో గర్భస్రావం, వంధ్యత్వం, పాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల స్రావాలు తాకినా, పాలు మరిగించకుండా తాగినా మనుషులకూ ఇది సోకుతుంది. దీని వల్ల పురుషుల్లో వృషణాల వాపు, వీర్యం విడుదలలో ఇబ్బంది, మహిళల్లో అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. ✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News October 31, 2025

అప్పుడు పక్కన పెడితే.. ఇప్పుడు కప్పుకు చేరువ చేసింది

image

సెమీస్‌లో అద్భుతమైన ఆటతో భారత్‌ను WWC ఫైనల్ చేర్చిన జెమీమా రోడ్రిగ్స్ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. గత WC(2022)లో ఆమెను జట్టులోకే తీసుకోలేదు. ఈసారి ఫామ్‌లో ఉండటంతో తొలిసారి WC ఆడే ఛాన్స్ ఇచ్చారు. కానీ తొలి 4 మ్యాచుల్లో జెమీమా 2సార్లు డకౌట్ కాగా మరో 2సార్లు 30ల్లో ఔట్ అయ్యారు. దీంతో ENG మ్యాచులో తప్పించారు. అయినా కుంగిపోకుండా తర్వాత NZపై 76*, నిన్న సెమీస్‌లో 127* రన్స్ చేసి INDను ఫైనల్ చేర్చారు.

News October 31, 2025

లీగల్‌ కేసుల్లో మహిళలకు ప్రైవసీ

image

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 228A, లైంగిక వేధింపులకు గురైన ఉమెన్‌ ఐడెంటిటీని బయట పెట్టడాన్ని నిషేధిస్తుంది. ఆమె పేరు, అడ్రస్‌ లేదా ఇతర వివరాలను వెల్లడించకూడదు. ఏ వివరాలు బయట పెట్టాలన్నా ఆమె అనుమతి ఉండాలి. తమ గురించి బయటకు తెలిసి పోతుందనే భయం లేకుండా, ఎక్కవ మంది బాధితులు బయటకు వచ్చి కంప్లైంట్‌ చేయాలనే ఉద్దేశంతో ఈ హక్కు కల్పించారు.