News March 18, 2024
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు పొందని పార్టీలివే!

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దేశంలోని అనేక పార్టీలు రూ.వేల కోట్ల విరాళాన్ని పొందగా, కొన్ని ప్రముఖ పార్టీలకు ఒక్క రూపాయీ అందలేదు. CPM, CPI, మాయావతి నేతృత్వంలోని BSP, మేఘాలయలోని అధికార నేషనల్ పీపుల్ పార్టీ, AIMIM, మహరాష్ట్ర నవ నిర్మాణ సేనకు బాండ్ల ద్వారా విరాళాలు రాలేదు. జొరమ్ పీపుల్స్ మూమెంట్ పార్టీ(మిజోరం), అసోమ్ గణ పరిషద్(అస్సాం), CPI-ML, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఈ లిస్టులో ఉన్నాయి.
Similar News
News November 15, 2025
పేదల తరఫున గొంతెత్తుతూనే ఉంటాం: RJD

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఆర్జేడీ ఫలితాలపై తొలిసారి స్పందించింది. ప్రజాసేవ నిరంతర ప్రక్రియ అని, దానికి అంతం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎత్తుపల్లాలు సహజమని పేర్కొంది. ఓటమితో విచారం.. గెలుపుతో అహంకారం ఉండబోదని తెలిపింది. ఆర్జేడీ పేదల పార్టీ అని, వారి కోసం తన గొంతును వినిపిస్తూనే ఉంటుందని ట్వీట్ చేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 25 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే.
News November 15, 2025
రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News November 15, 2025
మూవీ ముచ్చట్లు

* Globetrotter ఈవెంట్లో SSMB29 టైటిల్ వీడియో ప్లే అయ్యాక ఆన్లైన్లో రిలీజ్ చేస్తాం: రాజమౌళి
* రజినీకాంత్ హీరోగా తాను నిర్మిస్తున్న ‘తలైవర్ 173’ మూవీ నుంచి డైరెక్టర్ సి.సుందర్ తప్పుకున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్
* దుల్కర్ సల్మాన్-భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చిన ‘కాంత’ చిత్రానికి తొలిరోజు రూ.10.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్
* రోజుకు 8 గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుంది: దీపికా పదుకొణె


