News June 5, 2024
జగన్ సభలకు పోటెత్తిన జనం.. అయినా అంతుచిక్కని ఫలితం!

AP ఎన్నికల ప్రచారంలో భాగంగా YCP నిర్వహించిన సిద్ధం సభలకు లక్షల సంఖ్యలో జనం ఉప్పెనలా వచ్చారు. జగన్ బస్సుయాత్రలోనూ పోటెత్తారు. ఆ తర్వాత ప్రచార సభలకూ బ్రహ్మరథం పట్టారు. ఫలితాల్లో మాత్రం 11 MLA, 4 MP సీట్లతో YCPకి ఘోర ఓటమిని కట్టబెట్టారు. రాయలసీమలోని వైసీపీ కంచుకోటలనూ కూటమి బద్దలుకొట్టింది. తమ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉందా? అనేలా అంతుచిక్కని ఫలితాలు రావడంతో YCP శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


