News January 22, 2025

తెలుగు రాష్ట్రాల్లో పురుష, మహిళా ఓటర్ల శాతం ఇలా..

image

దేశంలోని 12 రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఏపీలో 100 మంది పురుషులకు గానూ 103 మంది(100:103) మహిళలు, తెలంగాణలో 100 మంది పురుషులకు 100 మంది మహిళా ఓటర్లు(100:100) ఉన్నట్లు పేర్కొంది. కేరళ, అరుణాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా ఈ నిష్పత్తి 100: 109గా ఉంది. అత్యల్పంగా గుజరాత్, హరియాణా, ఢిల్లీలో 100:84గా ఉన్నట్లు తెలిపింది.

Similar News

News January 5, 2026

‘రాయలసీమ ప్రాజెక్ట్‌’పై అసలేం జరిగిందంటే…

image

రాయలసీమకు సాగునీటి కోసం YS జగన్ CMగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే అనుమతులు లేకుండా దీన్ని చేపట్టారని TG SCని ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్లొద్దని కేంద్రమూ APని ఆదేశించింది. మరోవైపు జి.శ్రీనివాస్(TG) అనే వ్యక్తి కేసు వేయగా పనులు ఆపేయాలని 2020 OCT 29న NGT తీర్పిచ్చింది. 2024లోనూ పనుల నిలుపుదలకు ఆదేశాలిచ్చింది. దీనిపై 2025 MARలో AP కౌంటర్ దాఖలు చేసింది. ఈనెల 22న NGTలో విచారణ జరగనుంది.

News January 5, 2026

మళ్లీ పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18766451>>మళ్లీ<<>> పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.2,020 పెరిగి రూ.1,37,840కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,850 ఎగబాకి రూ.1,26,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.8వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 5, 2026

వారానికి 5 రోజులే పని చేస్తామని డిమాండ్.. కరెక్టేనా?

image

వారానికి 5 రోజులే పని చేస్తామని బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. UPIతో పనిభారం చాలా వరకు తగ్గిందని.. ఇప్పటికే రెండు, నాలుగో శనివారాలు సెలవులు ఉన్నాయి కదా అని పలువురు గుర్తు చేస్తున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్, ప్రొడక్టివిటీ పెంచేందుకు సెలవులు అవసరమని ఉద్యోగులు అంటున్నారు. వారానికి రెండు సెలవులతో బ్యాంకుల మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. COMMENT?