News April 25, 2024
డిపాజిట్ దక్కని వ్యక్తి ఎమ్మెల్యే అయ్యారు!

1952 ఎన్నికల్లో విశాఖ(D) పరవాడలో ఉన్న 60,780 ఓట్లలో 25,511 మాత్రమే పోలయ్యాయి. ఇందులో వీరభద్రం(CPI)కి అత్యధికంగా 7,064 ఓట్లు వచ్చాయి. అప్పటి రూల్ ప్రకారం డిపాజిట్ దక్కాలంటే పోలైన ఓట్లలో 3వ వంతు.. అంటే 8,504 ఓట్లు రావాలి. అయితే ప్రత్యర్థిపై ఒక్క ఓటు అధికంగా వచ్చినా వారే విజేత అన్న కమ్యూనిస్టుల వాదనతో వీరభద్రంను MLAగా EC ప్రకటించింది. ఆ తర్వాత డిపాజిట్ దక్కేందుకు 6వ వంతు ఓట్లు రావాలని రూల్ మార్చింది.
Similar News
News December 20, 2025
త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ!

TG: కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో దేశంలోని పలు రాష్ట్రాలు మావోయిస్టు రహితంగా మారుతున్నాయి. తెలంగాణ అదే బాటలో పయనిస్తోందని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది అత్యధికంగా 509 మంది మావోలు రాష్ట్రంలో లొంగిపోయారని వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఇంకా పోలీసుల రికార్డుల్లో ఉన్నది 21 మంది మాత్రమేనని పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే మావో రహిత రాష్ట్రంగా ప్రకటించుకున్న మధ్యప్రదేశ్ సరసన TG చేరే అవకాశముంది.
News December 20, 2025
శ్రీశైలంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు: ఈవో

AP: శ్రీశైలం ఆలయ పరిధిలో రీల్స్, అన్యమత ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని EO శ్రీనివాసరావు హెచ్చరించారు. అనుమతి లేకుండా వీడియోలు తీయడం, డ్రోన్లు ఎగురవేయడంపై నిషేధం ఉందన్నారు. ధూమపానం, మద్యపానం, జూదం ఆడటం లాంటివి చేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఆలయ పవిత్రత, భక్తుల ప్రశాంతతకు భంగం కలిగించకూడదన్నారు. ఇటీవల శ్రీశైలంలో ఓ యువతి రీల్స్ చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
News December 20, 2025
INDvsPAK.. రేపే U19 ఆసియా కప్ ఫైనల్

U19 ఆసియా కప్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. రేపు PAKతో భారత్ తలపడనుంది. లీగ్ దశలో దాయాదిని మట్టికరిపించిన ఆయుష్ సేన ఫైనల్లోనూ షాకిచ్చి కప్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. సూర్యవంశీ, అభిజ్ఞాన్, ఆరోన్ సూపర్ ఫామ్లో ఉండటం INDకు కలిసిరానుంది. అటు పాక్ కూడా ఒక్క మ్యాచ్ మినహా అన్నింట్లోనూ గెలిచి జోరుమీదుంది. రేపు 10.30AM నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీలివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.


