News March 7, 2025

‘శ్రీశైలం’ దిగువన గొయ్యి ప్రమాదకరం.. పూడ్చేయండి: NDSA

image

శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఏర్పడిన గొయ్యి(ప్లంజ్ పూల్)ని మే నెలాఖరులోపు పూడ్చేయాలని తెలుగు రాష్ట్రాలకు NDSA సూచించింది. డ్యాం పునాది 380 అడుగులు ఉంటే ఈ గొయ్యి 410 అడుగుల వరకు ఉందని తెలిపింది. కృష్ణా నదికి ఏటా వస్తున్న వరదలతో ప్లంజ్ పూల్ ప్రాజెక్టుకు ప్రమాదకరంగా మారుతోందని తెలిపింది. సముద్ర తీరం కోతకు గురికాకుండా వినియోగించే టెట్రా పాట్స్‌తో చర్యలు చేపట్టవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.

Similar News

News December 13, 2025

2026లో ఉద్యోగాల జాతర.. RRB క్యాలెండర్ విడుదల

image

2026 ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నోటిఫికేషన్‌ రిలీజ్ కానుంది. మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్‌లో సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. జులైలో పారామెడికల్, జేఈ, ఆగస్టులో NTPC, సెప్టెంబరులో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు, అక్టోబర్‌లో గ్రూప్-D నియామకాలు ఉండనున్నాయి.

News December 13, 2025

కస్టమ్స్‌ కమిషనర్ ఆఫీస్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

కోచిలోని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఆఫీస్‌లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ట్రేడ్స్‌మన్, సీమ్యాన్, గ్రేసర్, సీనియర్ స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. సీనియర్ స్టోర్ కీపర్ పోస్టుకు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: taxinformation.cbic.gov.in/

News December 13, 2025

పేరు మార్పుతో ప్రయోజనం ఏంటి: ప్రియాంకా గాంధీ

image

ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును ‘పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం’గా మార్చాలన్న <<18543899>>కేంద్ర నిర్ణయం<<>>పై కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వలన ఏ ప్రయోజనం ఉంటుందో అర్థం కావడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసులతో పాటు పత్రాలలో పేరు మార్చాల్సి రావడం వల్ల ప్రభుత్వానికి భారీగా ఖర్చవుతుందని పేర్కొన్నారు. అనవసర వ్యయంతో ప్రజలకు లాభం ఏమిటని ప్రశ్నించారు.