News November 15, 2024
అంతర్జాతీయ ప్రయాణికులు వచ్చే చోటు.. పేరుమార్చిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని సరాయి కాలే ఖాన్ చౌక్ పేరును భగవాన్ బిర్సాముండా చౌక్గా మార్చింది. స్వతంత్ర సమరయోధుడు, గిరిజనుల ఆరాధ్యదైవం అయిన బిర్సాముండా 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా నగరంలోని ఇంటర్నేషనల్ బస్టాండ్ వద్ద ఆయన విగ్రహం ఆవిష్కరించింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బిర్సాముండా గిరిజనులతో సైనిక విప్లవం సృష్టించారు. ఆయన జయంతి రోజైన NOV 15ను కేంద్రం 2021లో జన జాతీయ గౌరవ దివస్గా ప్రకటించింది.
Similar News
News November 28, 2025
గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి) ఎలా గుర్తించాలి?

ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.
News November 28, 2025
తిరుమల శ్రీవారి పుష్పాలను ఏం చేస్తారో తెలుసా?

తిరుమల శ్రీవారి సేవ కోసం రోజుకు కొన్ని వందల కిలోల పూలు వాడుతారు. మరి వాటిని ఏం చేస్తారో మీకు తెలుసా? పూజ తర్వాత వాటిని బయట పడేయరు. తిరుపతికి తరలిస్తారు. అక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలోని పూల ప్రాసెసింగ్ యూనిట్కు పంపుతారు. ఈ యూనిట్లో ఈ పూల నుంచి పరిమళభరితమైన అగరబత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలను తయారుచేస్తారు. తద్వారా పూల పవిత్రతను కాపాడుతూనే, వాటిని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తారు.
News November 28, 2025
2026 సెలవుల జాబితా విడుదల

కేంద్రం 2026 సంవత్సరానికి అధికారిక <


